5402 articles
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ (31), యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదిభట్ల పోలీసుల కథనం ప్రకారం నెల్లూరుకు చెందిన భరత్ కాంత్, త్రిలోక్ ప్రాణ స్నేహితులు. […] The post ఘోర రోడ్డు ప్రమాదం.. యువ నటుడు, కెమెరామెన్ మృతి appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : జనాభా లెక్కల్లో కీలకమైన గృహగణన నేటి(మే 11) నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది. ఇంటి నంబర్, గదుల సంఖ్య, కుటుంబ వివరాలు, సౌకర్యాలు, వాహనాల సమాచారం, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఏప్రిల్ 26న ప్రారంభమైన స్వీయ నమోదు నిన్నటితో ముగిసింది. రాష్ట్రంలోని దాదాపు 1.30 కోట్ల కుటుంబాల్లో కేవలం 3% మాత్రమే స్వీయ నమోదు […] The post తెలంగాణలో నేటి నుంచి గృహ గణన appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్ను ప్రకటించింది. కేవలం రూ.225 రీఛార్జ్తో 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా నెలకు మొత్తం 75 GB డేటా లభిస్తుంది. ప్రయివేటు టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే ఎక్కువ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ముఖ్యంగా సెకండరీ సిమ్ గా బీఎస్ఎన్ఎల్ వాడుతున్న వారికి, […] The post బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ appeared first on Navatelangana.


వికసిత్ భారత్ నిర్మాణంలో తెలంగాణను భాగస్వామ్యం చేస్తాంగుజరాత్ మోడల్ నిర్మాణంలో మన్మోహన్ సహకరించినట్లే నాకూ మద్దతివ్వండి హెచ్ఐసిసి సభలో ప్రధానికి సిఎం రేవంత్ విజ్ఞప్తులు హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్న ముఖ్యమంత్రిమనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళిక వికసిత్ భారత్తో కలిసి నడుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. దేశ ప్రగతికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయబోమని, వికసిత్ భారత్ నిర్మాణంలో తెలంగాణను భాగస్వామిని చేస్తామని ఆయన ప్రధానికి హామీ ఇచ్చారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే మనకు అత్యధిక ప్రాధాన్యం... ముందు భారత దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనేది స్పష్టం అని పేర్కొన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనిలో తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని వెల్లడించారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తెలంగాణ సాధిస్తుందని, మోదీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన ప

రోజుకు రూ.1,600-1,700 కోట్లు లాస్ ఇరాన్ యుద్ధంతో చమురు కంపెనీలపై పెరిగిన ఆర్థిక భారంఇలాగే కొనసాగితే కంపెనీల ఆర్థిక స్థితి దెబ్బతినొచ్చునిపుణుల హెచ్చరిక త్వరలో ప్రజలకు పెట్రో షాక్?న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధం పరిస్థితులు భారతీయ చమురు కంపెనీలపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సం ఘర్షణ ప్రారంభమై 10 వారాలు గడుస్తున్నా ప్రజలపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వరంగ చమురు సంస్థలు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచకుండా పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. దీనివల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలి యం వంటి సంస్థలు ప్రతిరోజూ సుమారు రూ. 1,600 నుండి రూ.1,700 కోట్ల వరకు నష్టపోతున్నాయి. గత 10 వారాల్లో ఈ మొత్తం నష్టం రూ.1 లక్ష కోట్లు దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ధరలను 30 శాతం వరకు పెంచినప్పటికీ భారత్లో రెండేళ్ల క్రితం ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ. 94.77, డీజిల్ రూ.87.67గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర 50 శాతం పెరిగినప్ప



న్యాయం కోసం బాధితురాలు స్టేషన్కు వెళ్తే కేసు నమోదుకు ఎనిమిది గంటలా?కాంగ్రెస్, బిజెపి మధ్య చీకటి ఒప్పందం: హరీశ్రావుమనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదై.. 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సిఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా..? అని అడిగారు. పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై దుష్ప్రచారం నేను ఫాంహౌస్లో ఎలుకను కాదు సికింద్రాబాద్ సభలో బండి సంజయ్ ఫైర్మన తెలంగాణ/హైదరాబాద్: ‘తానెప్పుడూ పార్టీ తలెత్తుకునే పనే చేస్తా తప్ప తలదించుకునే పని ఎప్పుడూ చేయనని’ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భావోద్వేకంతో అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కంటతడిపెట్టుకుని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కొందరు తన మీద కుట్రలు చేయాలని చూస్తున్నారనిఆరోపించారు. తాను ఏనాడు బీజేపీకి తలవంపులు తేలేదు, మీ తాటాకు చప్పళ్లకు భయపడేటోడిని కాదని అన్నారు. భయపెడితే భయపడటానికి మీ ఫాంహౌజ్లో ఎలుకను కాదు, అయ్యపేరు చెప్పి, ఆస్తులకు కూడగట్టుకునేటోడిని కాదని, ధర్మం కోసం పనిచేసే కాషాయ కార్యకర్తనని ఆవేశంగా ప్రసంగించారు. కాషాయ జెండా మోస్తున్న మోడీ సైనికుడినిఅంటూ చేసిన ప్రసంగంతో పరేడ్ మైదానమంతా పులకించిపోయి జై శ్రీరాం నినాదాలతో మారుమోగింది. బెంగాల్ తర్వాత మన తర్వా


మన తెలంగాణ/సిటీబ్యూరో: మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) హత్య కేసులో పధాన నిందితురాలైన కల్పనను హైదరాబాద్ పోలీసులు పు ణెలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కల్పన గత కొన్నిరోజుల క్రితం వినయ్ రం జన్ రే ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం వేచిచూసిన కల్పన నేపాల్కు చెందిన ఇద్దరు వ్యక్తులను రప్పించి తనూజ నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించింది. ఊపిరి ఆడకపోవడంతో తనూజ మృతిచెందింది. కేసు ను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు గా లింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, నేపాల్ ముఠాను పట్టుకునేందుకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ 10 బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు నేపాల్ సరిహద్దుతో పాటు నిందితుల దేశానికి వెళ్లి నిఘా పెట్టాయి. హత్య చేసిన అనంతరం ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్కు వెళ్లి, అక్కడినుంచి రైలులో ముంబైకి నిందితులు పారిపోయినట్లు గు ర్తించిన పోలీసులు వారిని ఫాలో అయ్యా రు.ఇందులో భాగంగానే కొన్ని పోలీసు బృందాలు వారి వెంట వెళ్లాయి. ప్రధాన నిందితురాలైన కల్పన పుణెలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడంతో ఆమె ను అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు

వీధి కుక్క మేకలు గొర్రెలు రక్తంతో దందా ప్లేట్లెట్స్ను మనుషులకూ ఎక్కిస్తున్న వైనం నాడు నాగారం.. నేడు రాయదుర్గంలో వెలుగులోకి.. జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులకు మెయిల్ ఫిర్యాదు స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం.. పెట్స్కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీజ్.. అమానవీయ దందాపై సర్కారు నిఘా వెల్లడవుతున్న విస్తుపోయే వాస్తవాలు నవతెలంగాణ- సిటీబ్యూరో గ్రేటర్ హైదరాబాద్ బ్లడ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటి వరకు మనుషుల రక్తంతోనే వ్యాపారం చేసిన కొందరు కేటుగాళ్లు […] The post బ్లడ్ మాఫియా! appeared first on Navatelangana.
లేదంటే ఉద్యమం తప్పదురాష్ట్రంలో ఆ కోడ్లను అమలు చేయబోమంటూ ప్రకటించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలనీ, లేదంటే సమరశీల పోరాటాలు తప్పవని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయబోమని రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఙాన […] The post లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే appeared first on Navatelangana.
వార్ దెబ్బకు అర్థవంతమైన ఖర్చులకు ప్రాధాన్యం : డెలాయిట్ రిపోర్టున్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం దెబ్బకు ప్రపంచమంతా తలకిందులైంది. 70 రోజులైనా..యుద్ధ భయం వెంటాడుతూనే ఉన్నది.ఈ నేపథ్యంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ వినియోగదారులు తమ ఆకాంక్షలను, ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేసుకుంటున్నారని డెలాయిట్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. భారతీయులు విలాసాల కంటే, నిత్యావసరాలకు, అర్థవంతమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేసింది. డెలాయిట్ ‘కన్జూమర్ సిగ్నల్స్ ఇండియా చాప్టర్’ తన […] The post విలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు appeared first on Navatelangana.
పాఠశాల విద్యపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ఈ ఏడాది యధావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ఆయన ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీన ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదని పాత పద్దతిలో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్ ను […] The post ఈ ఏడాది యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లు appeared first on Navatelangana.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంకార్మికుల మనోధైర్యానికి నిదర్శనం భ్రమరాంబిక నగర్ : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుబీరంగూడలో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్నవతెలంగాణ- అమీన్పూర్కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడే ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలోని భ్రమరాంబిక నగర్, మాస్టర్ మైండ్ స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ […] The post కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం appeared first on Navatelangana.
ఇరాన్ స్పందన కోసం అమెరికా నిరీక్షణపశ్చిమ ఆసియా శాంతి చర్చలు ముమ్మరంఅమెరికా, ఇరాన్ ఘర్షణ చాలా క్లిష్టమైనదిఅణ్వాయుధాల కోసం టెహ్రాన్ ప్రయత్నిస్తున్నట్టు ఆధారాలు లేవు: పుతిన్ టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. శనివారం హార్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గిన సంకేతాలు కనిపించాయి. ఈ సంఘర్షణను అంతం చేసే లక్ష్యంతో అమెరికా ముందుకు తెచ్చిన కొత్త శాంతి ప్రతిపాదనపై ఇరాన్ స్పందన కోసం […] The post హార్ముజ్ ప్రతిపాదనపై అనిశ్చితి appeared first on Navatelangana.