🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5570 articles

రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 230
Telangana

రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 230

ఐపిఎల్ 2026లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.118 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది.యశ్ రాజ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ (55: 36 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స్ లు) జోఫ్రా ఆర్చర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 16.2 ఓవర్ లో బ్రిజేశ్ శర్మ బౌలింగ్ లో శుభమన్ గిల్ (84: 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లు) తుషార్ దేశ్ పాండేకు క్యాచ్ ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 37, రాహుల్ తె వాతియా 14 నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2, యశ్ రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.

RR vs GT:  హాఫ్ సెంచరీలతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు .. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. 'కల్కి 2' రిలీజ్ ఆ సంవత్సరమేనా?.. కారణం అదేనట!
గచ్చిబౌలి లో కార్ దగ్ధం..
Telangana

గచ్చిబౌలి లో కార్ దగ్ధం..

నడుస్తున్న కార్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేకుంది. పోలీసుల వివరాల ప్రకారం మోయిజ్ (28) శ్రీరాం నగర్ లో నివాసముంటున్నాడు. శనివారం బంజారాహిల్స్ నుండి వాసెల్లా మెడోస్ వైపు వెళుతుండగా, కొత్తగూడలోని ఎస్.ఎల్.ఎన్.టి సమీపంలో టిఎస్07హెచ్ కె5555 నెంబర్ గల మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రికల్ 300 కారు లో పొగలు వచ్చాయి. వెంటనే అప్రమతమైన డ్రైవర్ వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ మేరకు స్థానికులు అగ్నిమపాక సిబ్బంది కు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకం
Telangana

కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకం

ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, పెద్ది వెంకట్రాములు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నర్సింహా, జక్కిడి నర్సింహా రెడ్డి, ఈర్లపల్లి ముత్యాలు, నాగటి మారన్న, ప్రజా వాగ్గేయకారులు చింతల యాదగిరి, కాకం అంజన్న, పాటల వెంకన్న, చంద్రమౌళి,అమరావతి శివ, రాము, కామ్రేడ్ నూర్జహన్ పై నివాళి గీతాలు ఆలపించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గూడూరు […] The post కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకం appeared first on Navatelangana.

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు
Telangana

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు

మంజూరైన లబ్ధిదారులు అందరూ ప్రారంభించాలి అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్నవతెలంగాణ-మిడ్జిల్ అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చెప్పారు. శనివారం మండలంలోని లింబ్య తండాలో స ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతినీ పరిశీలించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సహాయంతో సొంత ఇంటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని కొంత […] The post నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు appeared first on Navatelangana.

ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
Telangana

ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

నవతెలంగాణ- ఆలేరు టౌను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రూ.7800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నట్లు, బిజెపి యువ నాయకులు బిర్కూరి ప్రదీప్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను, కోట్ల విలువైనవి ప్రజలకు అంకితం చేస్తారని, అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్శన కేవలం అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువైన […] The post ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం appeared first on Navatelangana.

దండోరా
Telangana

దండోరా

పక్కలో కలలు వొదిలేసిఆత్రమాత్రం అంగి లాగు తొడిగిఅల్లరి కష్ణుడిని రోలుకు బంధించినట్టుకళ్ళద్దాలు చెవులకు కట్టుకునియుద్ధమేదో ఊడిపడుతున్నట్టురెండు పయ్యల గుర్రమెక్కి బయళుదేరురాచకార్యంలౌడు స్పీకర్‌ ఏదో మింగేసినట్టుఅంత పెద్ద నోరేసుకునిక్షణాల్లో ఇంటింటికి చేరిపోయే కరపత్రంవాడ వాడలాగణ గణ మ్రోగే వాట్సాప్‌ సందేశంపొద్దు పొద్దున్నే సూర్యుడు వొచ్చినట్టుగుండె దరువు మీదఅలుపెరుగని పాట ఎత్తుకుని ప్రచారంమనిషి మనిషికీ పంచిపెట్టురాజన్న ఫలహారంమైకు లేక పోయినాసభ దద్దరిల్లి పోయేలా ఉపన్యసించే వక్తలాఊరంతా అదిరిపోయే కంచు కంఠంపెద్దల కంటికి అగుపడని చిన్నోడుపై మెట్టు ఎక్కడం రానిఆకలి డొక్కల […] The post దండోరా appeared first on Navatelangana.

కాటి కాపరి జీవితాలపై వచ్చిన నవల
గోండ్‌ కతీరా…
అమ్మే ధైర్యం !
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి: సబితా ఇంద్రారెడ్డి
Telangana

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి: సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం వెనక్కి పోతుందని అన్నారు. ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప ప్రభుత్వం శాంతిభద్రలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఎంఎల్‌సి సురభి వాణిదేవితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం హోం మంత్రి బాధ్యతలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుని సిఎం రేవంత్ రెడ్డి హోం శాఖపై సమీక్ష చేయడం లేదని పేర్కొన్నారు. కెసిఆర్ హోం శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. దేశంలో మొదటిసారిగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్రంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేశారని, మల్కాజిగిరి పోలీస్ కమీషనర్ అర్ధ రాత్రి గస్తీకి వెళ్తే పోకిరీలు ఎలా వేధించారో అందరికి తెలుసని అన్నారు. తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ చెబుతున్నాయని పేర్కొన్నారు. 2023 కంటే 2024లో 34 వేల కేసులు పెరిగాయని, రాష్ట్రంలో 18.4 శాతం క్రై

రాత్రి పూసిన
ఈ విధ్వంసాన్ని ఆపండి,వారసత్వ సంపదను కాపాడండి
Telangana

ఈ విధ్వంసాన్ని ఆపండి,వారసత్వ సంపదను కాపాడండి

ఈ విధ్వంసాన్ని నిలిపేసి, వారసత్వ సంపదను కాపాడండని కొత్త తెలంగాణ చరిత్రబృందం వినతి.800సం.ల కాకతీయులు నిర్మించిన ఈ శివాలయాన్ని కూల్చడానికి దినం పట్టకపోవచ్చు. కాని, కట్టడానికి యేండ్లు పడుతయి. ఆ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఆవరణలో గుడి వుంటే దేనికి అడ్డంకి. అదొక వారసత్వనిర్మాణాన్ని ఉండనీయొచ్చుకదా. ఎవరిదీ పాపం? ఎందుకా గుడికి శాపం?? వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని అశోక్‌నగర్‌ సమీపంలో కాకతీయుల నాటి ఆలయాన్ని కూల్చివేయబడ్డది. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రెటేడ్‌ స్కూల్‌ ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ […] The post ఈ విధ్వంసాన్ని ఆపండి,వారసత్వ సంపదను కాపాడండి appeared first on Navatelangana.

దిగులు పద్యం!
Telangana

దిగులు పద్యం!

రోజు ఎన్నిసార్లు ఉదయించినాదిగులు మేఘమొక్కటీ తొలగిపోవడం లేదు!మంచి కాలాన్ని కలగనటానికిధైర్యం విలోలమవుతున్నది!అంతటా ప్రజాస్వామ్యం ఓ మేలిముసుగేహొభూగోళమంతా నియంతత్వమే!కన్నెత్తి చూడలేముహొపన్నెత్తి మాట్లాడలేము!నువ్వూ నేనూ చేస్తున్న యుద్ధాలన్నీజానెడు పొట్ట పోసుకోవడానికే!వాళ్ళెందుకు యుద్ధాలు చేస్తున్నారు?!మనకెవరికీ అర్థం కాని ప్రశ్న!కొట్టుక చస్తున్నది వాళ్లు కదాహొదుఖం మననెందుకు చుట్టుముడుతున్నది?బడి ఆసుపత్రి విమానాశ్రయాలు కూల్చేసిహొవిజయ ప్రకటనలా ఎంత అమానుషం?సహజ సంపదలని సర్వనాశనం చేశాకహొభూమ్మీద మనిషినెవడైనా మొలిపిస్తాడా?ఆధిపత్యాంహంకారం జడలు విప్పిన చోటహొహొప్రళయాలకు ద్వారాలు తెరుచుకుంటాయి!ఇక్కడే కాదు విశ్వవీధులన్నీచైతన్యాలను పాతిపెట్టినయి!అంతులేని రాజకీయ లాలసత్వంహొమనిషికిహొ సమాధులు తవ్వుతున్నది!!– కోట్ల వెంకటేశ్వర […] The post దిగులు పద్యం! appeared first on Navatelangana.

హైదరాబాద్ లో ఆగిపోయిన సీఎం చంద్రబాబు కాన్వాయ్... పది నిమిషాల పాటు ట్రాఫిక్ లోనే...
రేపు (మే 10) ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం
అమెరికాలో ఎల్బీనగర్‌ యువతి మృతి
Telangana

అమెరికాలో ఎల్బీనగర్‌ యువతి మృతి

స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కోడుదామని ప్రమాద వశాత్తు దూకి ఓ యువతి మృతి చెందిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడ డివిజన్ న్యూశివపురి కాలనీలో నివాసం ఉండే దేవేందర్‌రెడ్డి ,సునీతా దంపతులు కూమారై వీణ(28) అమెరికా వర్జీనియాలో నివాసం ఉంటుంది. వీణ ఓక విందు నిమిత్తం రెండు రోజుల క్రితం ఫ్లోరిడాకు వెళ్లింది, అక్కడ స్విమ్మింగ్ ఫూల్‌లో జరిగిన ఘటనలో యువతి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వారి నివాసానికి తరలివెళి ,వీణ తల్లి దండ్రులకు ధైర్యం చెప్పారు. ఈసంధర్బంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ.... వీణ బౌతిక కాయాన్ని త్వరలో ఇండియాకు రప్పించేందుకు తన వంతు సహాయ సహాకారాలు అందజేస్తానని తెలిపారు. మాజీ కార్పోరేటర్ వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి వీణ బౌతిక కాయాన్ని నగరానికి తెప్పించేందుకు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.

ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సిటీలో మూడు అంచెల రవాణా వ్యవస్థ : సీఎం రేవంత్ రెడ్డి
లైంగిక వేధింపుల ఆరోపణలపై శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్ట్
Telangana

లైంగిక వేధింపుల ఆరోపణలపై శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్ట్

శ్రీలంకలో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 71 ఏళ్ల సీనియర్ బౌద్ధ సన్యాసి పల్లెగమ హేమరత్నను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో బౌద్ధ సన్యాసి అరెస్టు కావడం సంచలనం కలిగించింది. అనురాధపుర లోని ప్రముఖ ఆలయ ప్రధాన పూజారి అయిన ఆయనను అనురాధపుర మెజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో శుక్రవారం రాత్రి అదుపు లోకి తీసుకున్నారు. నిందితుడికి సహకరించినందుకు బాధితురాలి తల్లిని కూడా అరెస్టు చేశారు. బాధితురాలి వయసు ఇప్పుడు 15 సంవత్సరాలు. అనురాధపుర ఆలయ ఆవరణలో బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని పోలీస్ అధికార ప్రతినిధి ఎఫ్‌టి వూట్లర్ విలేకరులకు చెప్పారు. ఈ సంఘటనపై గత మార్చిలో ఫిర్యాదు నమోదైంది. ఇది మొదట ఒక చిన్నారి అపహరణ, నిర్బంధానికి సంబంధించిన కేసు అని డైలీ మిర్రర్ మీడియా పోర్ట్లల్ నివేదించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించేసరికి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. అనురాధపుర కు 200 కిమీ దూరంలో రాజధాని కొలంబోలో ప్రైవేట్ ఆస్పత్రి ఎమర్జెన్సీ యూనిట్‌లో నిందితుడు చికిత్స పొందుతుండగా ఈ అరెస్టు జరిగింది. ఆయన తల్లిని కూడా అరెస్టు చేశారు. ప్రాచీన నగరమైన అనురాధపుర లో పవిత్ర క్షేత

నీట మునిగి తండ్రీకొడుకులు మృతి
Telangana

నీట మునిగి తండ్రీకొడుకులు మృతి

బావిలో పడిన లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రీకొడుకులు మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో శనివారం నాడు చోటుచేసుకుంది.బావిలో పడిన లేగ దూడను కాపాడేందుకు వెళ్లిన పవన్ కు ఊపిరాడక నీటమునిగాడు అది గమనించిన తండ్రి కోడుకును కాపాడేందుకు బావిలోకి దూకాడు. ఈ క్రమంలో తండ్రి కూడా నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.తండ్రికొడుకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

RashmikaVija: రష్మికతో ఫస్ట్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన విజయ్ దేవరకొండ!
నిజాంపేట్ లో అగ్నిప్రమాదం.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చెలరేగిన మంటలు
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA