రాష్ట్రంలోని యాత్రా స్థలమైన తిరుపతి కి భక్తులు అధిక సంఖ్యలో పర్యటించ డం తో మొదలవుతుంది. తిరుపతి లోని తిరుమల వెంకటేశ్వరా దేవాలయమే కాక ఇంకనూ రాష్ట్రంలో సందర్శించ తగిన అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. వాటిలో కపిల తీర్థం, పులికాట్ సరస్సు వంటివి ప్రసిద్ధి చెందినవి.
ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనేకమంది ప్రసిద్ధ కవులకు, రచయితలకు, కళాకారులకు జన్మస్థలం. ఈ ప్రదేశం, వివిధ సంస్కృతులు కల పాలకుల పాలనలో వుండటంచే వివిధ రీతుల తెలుగు మాట్లాడతారు. కూచిపూడి నాట్య జన్మస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని సాంప్రదాయ కూచిపూడి నాట్యం కు కృష్ణా జిల్లాలో కల కూచిపూడి అనే ఒక చిన్న గ్రామం పుట్టిల్లు. ఆంధ్ర ప్రదేశ్ ఆహారాలు ఆంద్ర ప్రదేశ్ లో ప్రజలకు ప్రధాన ఆహారం వరి అన్నం. ఇతర వంటకాలు దక్షిణ భారత దేశంలోని వంటకాలన్నిటి లోకి అతి ఘాటైనవి. కోస్తా ప్రాంతంలో సముద్రపు ఆహారాలు ప్రసిద్ధి. రాయలసీమ జిల్లాలు దక్షిణ కర్నాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు సన్నిహితంగా ఉండటంతో ఆయా రాష్ట్రాల వంటల రుచులు కూడా కలిగి వుంటాయి. ఈ ప్రాంతంలో బెల్లం మరియు జోన్నలచే తయారు చేయబడే బొరుగు ఉండలు, బియ్యం మరియు బెల్లం తో చేయబడే అరిశలు, మసాల బొరుగులు మరియు రవ లడ్డు లు ఒక ప్రత్యేకత.








