శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. దీని ప్రధాన కార్యాలయం శ్రీకాకుళంలో ఉంది. ఇది రాష్ట్రంలోని ఈశాన్య దిశలో ఉన్న ఆరు జిల్లాలలో ఒకటి. దీనిని గతంలో చికాకోల్ అని పిలిచేవారు. 1936 ఏప్రిల్ 1 వరకు గంజాం జిల్లాలో ఉండేది. తరువాత విశాఖపట్నం జిల్లాలో విలీనం చేయబడింది. దీనిని కళింగపట్నం అని కూడా అంటారు. ఇది నాగావళి నది ఒడ్డున ఉంది.
శ్రీకాకుళం జిల్లా లోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి, శ్రీకూర్మంలో కూర్మావతార మందిరం, శాలిహుండంలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు, కళింగపట్నంలోని దీప స్తంభం, ముఖలింగంలోని శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం, తేలినీలాపురంలోని తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.







