TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
🛕
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

ఇది విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం. లార్డ్ నరసింహ కు అంకితం చేయబడినది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విష్ణు భక్తులకు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయం సింహాచలం లేదా లయన్ హిల్ అని కొండ పైన నిర్మించబడింది. ఈ ఆలయం తిరుపతి తర్వాత భారతదేశంలో రెండవ ధనిక ఆలయం అని చెప్పవచ్చు. ఆలయ నిర్మాణం ఒరిస్సా మరియు ద్రావిడ శైలి ని అనుసరించి ఉంటుంది.

హిందూ మతం పురాణాల ప్రకారం, విష్ణువు తన క్రూరమైన తండ్రి చేతి నుండి అతని భక్తుడు అయిన భక్త ప్రహ్లాదుడుని కాపాడేందుకు నరసింహ రూపంలో వచ్చారు. ప్రహ్లాదుడు యొక్క తండ్రికి మనిషి ,జంతువు కాకుండా మరియు భూమి మీద కాకుండా ఖాళీ పై మరణిస్తే గాని చనిపోవటం సాధ్యం కాదని ఒక వరం ఉంది. అందువల్ల విష్ణువు సగం సింహం, సగం మనిషి రూపం ధరించి అతని ఒళ్ళో పెట్టుకొని అతని ప్రేగులను లాగటం వల్ల ప్రహ్లాదుడు తండ్రి మరణించెను. ఈ ఆలయం పద్దెనిమిది నరసింహ క్షేత్రాలు లేదా నరసింహ ఆలయాలలో ఒకటి.

ముస్లిం మత ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో దాడి మరియు దోపిడి చేసినప్పుడు కుర్మంత అనే కవి రక్షణ కోసం నరసింహ స్వామి ని తీవ్రంగా ప్రార్ధించాడు.ఆ గ్రామం వారిని నరసింహస్వామి ఆక్రమణదారుల సైన్యం దాడి నుండి రక్షించుటకు రాగి కందురీగల సమూహమును పంపించి రక్షించెను,అని కుడా నమ్మకం ఉంది.ఈ విదంగా రక్షించుట నరసింహ అనుగ్రహంగా భావిస్తున్నారు.

సింహాచలం వెళ్లే దారి అంతా పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది.ఈ ఆలయం కూడా మనలను మంత్రముగ్ధులను చేస్తుంది.

నేటివ్ ప్లానెట్.కం

🛕 మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రదేశాలు