పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో కలిపారు. అవశేష జిల్లాకు కేంద్రం భీమవరం. భీమవరంలోని భీమారామం, పాలకొల్లు లోని క్షీరారామం,పెనుగొండ (ప.గో) లోని శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయ సముదాయం, నరసాపురం తీరప్రాంతం, కొల్లేరు సరస్సు ముఖ్య పర్యాటక ఆకర్షణలు.






