ఎంఎంటీఎస్ విస్తరణకు అడుగులు పడ్డాయి. కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించే అంశంపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కొత్తగా మూడు స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. రైల్వే బోర్డు ఆమోదం తర్వాత వీటిని నిర్మించనుంది. వీటితో మరింతమందికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయి.