ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ తన భారతీయ మూలాలపై గర్వం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అవమానకరంగా ఉపయోగించిన ‘కూలీ’ అనే పదాన్ని ఆత్మగౌరవ చిహ్నంగా మార్చుకున్నామని ఆమె తెలిపారు. భారతీయ కార్మికుల కష్టం వల్లే దేశ అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్న కమలా, భారతీయ సంస్కృతిని పరిరక్షించిన ప్రవాస భారతీయుల సేవలను కొనియాడారు.