వరంగల్ నగరపాలక సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలతో అర ఎకరంలో "వేస్ట్ టూ బెస్ట్" పార్కును ఏర్పాటు చేసింది. చెత్తకుప్పల నుంచి సేకరించిన బాటిల్స్, టైర్లు, పైపులు, కవర్లు వంటి వ్యర్థాలతో 128కు పైగా కళాకృతులు రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే ఈ వినూత్న పార్క్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.