ఉత్తర టెక్సాస్‌లోని భారతీయుల అతిపెద్ద సాంస్కృతిక వేడుకల్లో ఒకటైన ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) ఆధ్వర్యంలో నిర్వహించే 49వ ఆనంద్ బజార్ ఆగస్టు 15న టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలోని కోమెరికా సెంటర్‌లో ఘనంగా జరగనుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవం 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ఇండోర్ మెగా ఈవెంట్‌కు వేలాది మంది భారతీయ-అమెరికన్లు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా వ్యాపారవేత్తలకు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించుకునేందుకు వెండర్ బూత్‌లు బుక్ చేసుకునే చివరి అవకాశం ఉందని IANT ప్రకటించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, షాపింగ్, పిల్లల వినోద కార్యక్రమాలు, ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

వేలాది కుటుంబాలు, వ్యాపారవేత్తలు, నిపుణులు పాల్గొనే ఈ వేదికలో తమ బ్రాండ్‌ను విస్తృతంగా పరిచయం చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యాపారవేత్తలు వెంటనే తమ వెండర్ బూత్‌లను రిజర్వ్ చేసుకోవాలని సూచించారు.

WhatsApp Image 2026-08-06 at 7.32.58 PM.jpeg