భారతీయ-అమెరికన్ రచయిత, వెల్‌నెస్ నాయకుడు శివానంద్ ప్రతిష్ఠాత్మకమైన 2026 నాటిలస్ బుక్ అవార్డ్స్‌లో గోల్డ్ అవార్డును అందుకున్నారు. ఆయన రాసిన ఆత్మకథ The Practice of Immortalityకు ఈ గౌరవం లభించింది.

ఈస్టర్న్ థాట్ స్పిరిచ్యువాలిటీ విభాగంలో శివానంద్ విజేతగా నిలిచారు. చైతన్యపూర్వక జీవనం, వ్యక్తిగత వికాసం, సామాజిక మార్పును ప్రోత్సహించే రచనలకు నాటిలస్ అవార్డులు ప్రదానం చేస్తారు.

కృత్రిమ మేధస్సు (AI) వేగంగా ప్రపంచాన్ని మార్చుతున్న సమయంలో నాయకత్వం వహిస్తున్నవారు మానసికంగా స్థిరంగా ఉండటం, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతో అవసరమని శివానంద్ పేర్కొన్నారు.

ఆయన స్థాపించిన Yoga of Immortals కార్యక్రమంపై University of Cincinnati, University of Kentucky College of Medicine, Rutgers Universityల సహకారంతో నిర్వహించిన అధ్యయనాల్లో ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది.

2025 మేలో ప్రచురితమైన The Practice of Immortality ప్రస్తుతం 15 దేశాల్లో, 7 భాషల్లో అందుబాటులో ఉంది. ఈ అవార్డుతో గత ఏడాదిలో శివానంద్‌కు ఇది రెండో అంతర్జాతీయ సాహిత్య గౌరవంగా నిలిచింది.