మన తెలంగాణ/లక్ష్మణచాంద: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్(డబ్లు) గ్రామానికి చెందిన గన్ను విశ్వరూప శ్రీనివాస్ దంపతుల కుమారుడు గన్ను నిత్యానందరెడ్డి (26) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. గత శనివారం ఆమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాలు కాగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోధనలు మిన్నంటాయి. మృతదేహాం స్వగ్రామానికి చేరుకోవడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.