హైదరాబాద్: చిలుకూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చిలుకూరు శివారులో కవిత కాలేజ్ వద్ద అతివేగంతో బైకు నడుపుతుండగా అదుపుతప్పి బైకుపై నుండి కిందపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.