
9 నెలల చిన్నారిని తల్లి చెరువులో ముంచి చంపిన సంఘటన బైరామల్గూడలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటలకు జరిగింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు లోకసాని అనురాధ (9 నెలలు)గా గుర్తించారు. మృతురాలు లోకసాని రాజేశ్వరి (34), ఇంజాపూర్ నివాసి.ఘటన సమయంలో తల్లి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాపోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.











