
బాలానగర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మా నగర్ లోని ఫేస్1 లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద పడి బాలిక మృతి చెందారు. బైక్ పై తన మామ తో వెళ్తున్న వేద శ్రీ(4) లారీ టైర్ కింద పడటంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాపిక్ కు అంతరాయం లేకుండా వాహనాన్ని అక్కడి నుంచి స్టేషన్ కు తరలించారు. పగటి సమయంలో భారీ వాహనాలు హైదరాబాద్ లోకి రావడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.











