
అమరావతి: నిరుద్యోగులతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని ఎపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇష్టమొచ్చినట్టు జివోలు మారుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్ సిలో అవకతవకలు జరిగాయని,రూ. 10 వేల కోట్లు ఫీజు రీయింబెర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ఒకరికో ఇద్దరికో డైరెక్టుగా ఉద్యోగం ఇచ్చేవారని, నీట్ లో అవకతవకలు జరిగితేనే కేంద్రమంత్రి రాజీనామా చేశారని బొత్స సత్యనారాయణ తెలియజేశారు. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలని, అప్పటి వరకు మంత్రి పదవి నుంచి తప్పించండని కోరారు. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబెర్స్ మెంట్ లేదు అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని క్లియరెన్స్ లు తామే తీసుకొచ్చామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.











