
అత్యవసర డయల్ 100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ (హెచ్సీ-661)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. యం.రమేష్ సస్పెండ్ చేశారు. ఆగస్టు 1 అర్ధరాత్రి గచ్చిబౌలి ఐకియా సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో బాధితుడు డయల్ 100కు రెండు సార్లు ఫోన్ చేసి పోలీసు సహాయం కోరాడు. ఇన్చార్జిగా ఉన్న హెచ్సీ సయ్యద్ యూనస్ సంఘటనా స్థలానికి వెళ్లకుండా "కాలర్ వల్ల ఇబ్బంది" అంటూ రెండు ఫిర్యాదులను మూసివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన పై సయ్యద్ యూనస్ను సైబరాబాద్ సిపి తక్షణమే సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సైబరాబాద్ సిపి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.











