
రాజమండ్రి: గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక్కడ నీటి మట్టం 13 అడుగులు నమోదైంది. నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.











