ముమ్మిడివరం: గోదావరి ఉద్ధృతి కారణంగా లంక గ్రామాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని శేరిలంక, కమిని, పశువులలంక, గురజాపులంక, కూనలంక, తానేలంక, పొట్టిలంకల్లోకి వరుద నీరు చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పలు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని ఇళ్లను ఖాళీ చేయించారు. కొన్ని చోట్ల మరబోట్లను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.