పెద్దపల్లి: గ్యాస్ సిలిండర్ పేలి దంపతులు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యౌటింక్లయిన్ కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పోతన కాలనీలోని 83వ బ్లాక్‌లో యాదవనేని వసంత్ విజ్ఞత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వకీల్‌పల్లి గనిలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మరో రూమ్‌లో ఉన్న సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానికులు వెంటనే దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ఎస్‌ఐ ప్రసాద్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.