
మన తెలంగాణ/హైదారాబాద్: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి విశ్వసనీయ వర్గాల సమాచారం. విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్కు తిరిగి రాగానే పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ఆ మరుసటి రోజు 24న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాయనున్నారని ఈ వర్గాల సమాచారం. ఈ మేరకు రంగం సిద్ధమైందని కూడా చెబుతున్నారు. సిడబ్లూసి సమావేశం జరిగిన రోజునే మంత్రి కొండా సురే ఖ కూతురు సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలను ము ఖ్యమంత్రి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదేమాదిరిగా కొండా సురేఖ కూతురు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ సహచర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకొని ఆమెపై చర్య తీసుకోకుండా వారు నిలువరించిన విషయాన్ని కూడా పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిసింది. ఒకవైపు సర్లో భారీ గా ఓట్లు తొలగింపు, మరోవైపు మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను, ప్రజలను సమాయత్తం చేస్తోన్న తరుణంలో ప్రభుత్వంలో కీలకమైన పదవులలో
ఉన్నవారే ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించ డం వల్ల ప్రజలలో చులకన అవుతామని సీఎం రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసిం ది. పార్టీ పెద్దలు కూడా సీఎం వాదనతో ఏకీభవిస్తూ పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించడానికి గ్రీన్ సి గ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అధిష్ఠానం మనోగ తం వెల్లడి అయిన తర్వాతనే మంత్రి కొండా సు రేఖకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యేలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చర్యకు డిమాండ్ చేయడం చకచకా జరిగిపోయినట్టు ఈ వర్గాల సమాచారం. సీఎం రేవంత్రెడ్డి పై మంత్రి కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలు చేసిన రోజు స్పందించని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఆ మరోసటి రోజు అధిష్టాన పెద్దల మనోగతం బహిర్గతం అయిన తర్వాతనే స్పందించడానికి కారణమని ఈ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
చిన్నారెడ్డిపై కూడా వేటు?
పార్టీ సీనియర్ నాయకుడు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డిపై చర్యకు కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఈ వర్గాల సమాచారం. శాసనసభ ఎన్నికలలో తనకు మొదట టికెట్ ఖరారు చేసి, ఆ తర్వాత డబ్బులు తీసుకొని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించిన విషయాన్ని కూడా అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం కావడం వల్లనే చర్య తీసుకున్నారన్న తప్పుడు సంకేతాలు ప్రజలలో వెళ్లకుండా చిన్నారెడ్డిపై కూడా చర్యకు అధిష్ఠానం ఆదేశించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించనున్నారని ఈ వర్గాల సమాచారం. ఇలా ఉండగా ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ పార్టీలోకి రావాల్సిందిగా కొండా సురేఖను జనసేన పార్టీ నాయకులు సంప్రందించినట్టు వరంగల్ ఆ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.











