
ఢిల్లీ: విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ నెరవేరిందని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రభుత్వం నుంచి ఇంకా అందలేదని అన్నారు. ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. కేంద్రం అంగీకరించిన అన్ని డిమాండ్లను నెరవేర్చకపోతే తాము మళ్లీ నిరసన చేపట్టాల్సి వస్తుందని సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి అత్యాచారం చేసిన వారికి పూలమాలలు వేస్తూ కనిపించారని, అందుకే విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని తాము సమర్థించమని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు.











