ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాత్రిపూట వీడియోలు చేస్తున్నారని, విద్యార్థులను కేంద్రం వేధిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎంత బెదిరించినా విద్యార్థులు జంతర్ మంతర్ నుంచి కదలరని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీక అని రాహుల్ గాంధీ విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని, రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారని తెలియజేశారు. నీట్ లీక్ పై విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులపై దాడి చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను శాఖ మార్చడం కూడా ఆమోదయోగ్యం కాదని, విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.