ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నీట్ పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రస్తక్తే లేదన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా మోడీ స్పందించారు. నీట్ పేపర్ లీక్ దోషులను, యువతకు హానీ చేస్తున్న వారిని, యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే విడిచిపెట్టే ప్రసక్తే లేదని మోడీ హెచ్చరించారు. యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని, యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని తెలియజేశారు. పేపర్ లీక్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని నరేంద్ర మోడీ సూచించారు.