అమరావతి: ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఏలూరు జిల్లా పొలవరం గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి గోదావరిలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద ఈ ఘటన చేసుకుంది. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు కోసం స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. గొమ్ముకొత్త గూడెంకి చెందిన మహిళలుగా మత్స్యకారులు గుర్తించారు.