ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆదివారం ఫలాంబరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లతో అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించారు. వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకొని భోజనాలు చేశారు.