రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకానికి రూ.116 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదల అనంతరం త్వరలో టెండర్ల ద్వారా ప్రక్రియ పూర్తి చేసి చెరువుల్లోకి ఉచితంగా చేప, పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.