
హైదరాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది. విశాఖ బీచ్లో ఇద్దరు గల్లంతయ్యారు. యువతి, యువకుడు అలల తాకిడికి కొట్టుకపోయారు. నీతూ, రాము అనే యువతి, యువకుడు స్నేహితులతో కలిసి విశాఖ పట్నం బీచ్ కు వచ్చారు. ఫోటోలు తీస్తుండగా నీతు నీళ్లలో పడిపోతుంగా రాము కాపాడాబోయారు. ఇద్దరు నీళ్లలో పడిపోవడంతో అలల తాకిడికి కొట్టుకపోయారు. ఇద్దరి కోసం గాలింపు పోలీసులు, రెస్క్యూసిబ్బంది గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు విశాఖ పట్నం జిల్లా పెదజాలరిపేట చెందిన వారిగా గుర్తించారు.











