
5167 articles

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలను వాడుకుంటున్నారంటూ దాఖలు చేసిన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన చిత్రాలతో టీ-షర్టులను విక్రయిస్తున్న ఓ వ్యాపారిపై మంగళవారం జస్టిస్ తుషార్ రావు గెడెలా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. విచారణ సందర్భంగా “నాగార్జున ఫోటోలను వాణిజ్యపరంగా వాడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అని సదరు వ్యాపారిని కోర్టు నిలదీసింది. దీనికి వ్యాపారి […] The post నాగార్జున ఫోటోలు టీ-షర్టులు..హైకోర్టు ఆగ్రహం appeared first on Navatelangana.



కామారెడ్డి: సోషల్ మీడియాలో లైక్ లు, వ్యూస్ కోసం వీడియో పోస్టు చేయడంతో అతడి ఇంటికి పోలీసులు వచ్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నంటూ వీడియో రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రోహిత్ ఇంటికి చేరుకున్నారు. తాను కేవలం వ్యూస్, లైక్ ల కోసమే ఈ వీడియో తీశానని చెప్పాడు. కానీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

అహ్మదాబాద్: ఐపిఎల్ లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఎస్ ఆర్ హెచ్ పై జిటి 82 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత గుజరాత్ 169 పరుగుల లక్ష్యాన్ని ఎస్ ఆర్ హెచ్ ముందు ఉంచింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులు చేసి ఆలౌటైంది.మ్యాచ్ ఓటమి అనంతరం ప్యాట్ కమ్నీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ జట్టు ఓటమి నిరాశ కలిగించిందని, ఇంకా ప్లే ఆఫ్స్ సాధించడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. జిటి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే ఆ జట్టు గెలుపొందిందని ప్యాట్ ప్రశంసించారు. అహ్మదాబాద్ పిచ్ పై లెంగ్త్ బౌల్స్ ప్రధానమైన మూడు వికెట్లు తీయడంతో తన ఓటమి ఖాయమైందన్నారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లు బౌలింగ్ లో లెంగ్త్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఐపిఎల్ లో టాప్ 4 బాట్య్స్ మెన్లు నాలుగు వందలకు పైగా పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నారని కొనియాడారు. గత ఏడు మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ లు గెలిచామని ప్యాట్ తెలియజేశారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్(38) మృతి చెందారు. అస్వస్థతకు గురైన ప్రతీక్ను హుటాహుటిన లఖ్నవూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. The post మాజీ సీఎం కుమారుడు మృతి appeared first on Navatelangana.

తిరుమల: హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం వద్ద వేద మంత్రోచ్చారణలు మేళతాళాల నడుమ టిటిడి ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుమలలో స్థానికంగా ఉన్న పలు హనుమాన్ ఆలయాల్లో కూడా హనుమజ్జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ఓ ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. మంగళవారం జత్ తహసీల్లోని మోతేవాడి గ్రామంలో ఉన్న మర్గుదేవి ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది. మర్గుబాయి దేవి వార్షిక జాతర సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షంతో పాటు బలమైన […] The post విషాదం..ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి appeared first on Navatelangana.




న్యూఢిల్లీ: టీం ఇండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఓ కొత్త అడుగు వేశాడు. ఓ ఫ్రాంచైజీకి ఆయన యజమాని అయ్యాడు. యూరోప్ టి-20 లీగ్2లో డబ్లిన్ గార్డియన్స్ జట్టును ద్రవిడ్ కొనుగోలు చేశాడు. ఈ ఏడాది ఆగస్టులో ఈ లీగ్ ప్రారంభంకానుంది. ఇందులో ఆరు ఫ్రాంచైజీలు తలబడతాయి. యూరోప్లో ఐసిసి ఆమోదం పొందిన తొలి బహుళ దేశాల క్రికెట్ టోర్నీ ఇదే. ఐర్లాండ్, స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ సంఘాలు ఈ లీగ్లో భాగమయ్యాయి. ‘‘యూరోప్లో దిగువ స్థాయి నుంచి క్రికెట్లో ప్రతిభావంతులను వెలికి తీయడానికి ఈ లీగ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆట ఎదుగుదలకు ఇదెంతో సహకరిస్తుంది. నన్ను ఆకట్టుకున్న అంశం అదే. అందుకే డబ్లిన్ గార్డియన్స్ జట్టును కొని ఈ లీగ్లో భాగమయ్యా. స్టార్ ప్లేయర్లతో స్థానిక కుర్రాళ్లు కలిసి ఆడబోతుండడంతో ఈ లీగ్ ఆసక్తికరంగా సాగబోతోంది’’ అని ద్రవిడ్ చెప్పాడు. యూరోప్ టి-20 లీగ్లో ఫ్రాంఛైజీల కొనుగోళ్లలో పలువురు మాజీ క్రికెటర్లతో పాటు బాలీవుడ్ స్టార్లు కూడా భాగమయ్యారు. అభిషేక్ బచ్చన్ ఐరోపా లీగ్ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఐరిష్ వోల్ఫ్స్ జట్టుకు మ్యాక్స్వెల్.. ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్కు స్టీవ్ వా.. ఎడిన్






నవతెలంగాణ – హైదరాబాద్ : నైజీరియా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ వెల్లడించింది. జంఫరా రాష్ట్రంలోని తుంఫా మార్కెట్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, దీనిపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనను రెడ్ క్రాస్ ధ్రువీకరించగా, నైజీరియా మిలిటరీ మాత్రం దీనిని ఖండించింది. మృతుల్లో పౌరులు లేరని బుకాయిస్తోంది. ఈ ఘటనలో ఎక్కువగా […] The post నైజిరియాలో వైమానిక దాడులు..100 మంది పైగా మృతి appeared first on Navatelangana.


నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పోలీసులు శుభమ్ ఖైర్నార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం అతడిని నాసిక్ పోలీసులు సిబిఐకి అప్పగించరు. దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని పలు చోట్ల సిబిఐ బృందాలు సోదాలు జరిపాయి. నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ బయటకు వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. నాసిక్ నుంచి గురుగ్రామ్కు చెందిన వైద్యుడికి పేపర్ చేరినట్లు పోలీసులు వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజ్పై లోతైన విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. నీట్ పరీక్ష తేదీని వారం, పది రోజుల్లో ప్రకటిస్తామని ఎన్టిఎ తెలిపింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. మళ్లీ దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్టిఎ తెలిపింది. రాష్ట్రం నుంచి 71,304 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ మార్కెట్లో ఒక రైతు 1,262 కిలోల ఉల్లిని కిలోకు ఒక్క రూపాయి చొప్పున విక్రయించి, మొత్తం రూ.1,262 మాత్రమే పొందాడు. అయితే, ఆ ఉల్లిని మార్కెట్కు తరలించడానికి లోడింగ్, రవాణా, తూకం కోసం రూ.1,263 ఖర్చు చేశాడు. దీంతో, పంటకు ప్రతిఫలం దక్కకపోగా, అదనంగా ఒక రూపాయి నష్టపోయిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. The post భారీగా పడిపోయిన ఉల్లి ధరలు appeared first on Navatelangana.