
5175 articles



నవతెలంగాణ – హైదరాబాద్ : నైజీరియా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ వెల్లడించింది. జంఫరా రాష్ట్రంలోని తుంఫా మార్కెట్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, దీనిపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనను రెడ్ క్రాస్ ధ్రువీకరించగా, నైజీరియా మిలిటరీ మాత్రం దీనిని ఖండించింది. మృతుల్లో పౌరులు లేరని బుకాయిస్తోంది. ఈ ఘటనలో ఎక్కువగా […] The post నైజిరియాలో వైమానిక దాడులు..100 మంది పైగా మృతి appeared first on Navatelangana.


నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పోలీసులు శుభమ్ ఖైర్నార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం అతడిని నాసిక్ పోలీసులు సిబిఐకి అప్పగించరు. దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని పలు చోట్ల సిబిఐ బృందాలు సోదాలు జరిపాయి. నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ బయటకు వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. నాసిక్ నుంచి గురుగ్రామ్కు చెందిన వైద్యుడికి పేపర్ చేరినట్లు పోలీసులు వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజ్పై లోతైన విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. నీట్ పరీక్ష తేదీని వారం, పది రోజుల్లో ప్రకటిస్తామని ఎన్టిఎ తెలిపింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. మళ్లీ దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్టిఎ తెలిపింది. రాష్ట్రం నుంచి 71,304 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ మార్కెట్లో ఒక రైతు 1,262 కిలోల ఉల్లిని కిలోకు ఒక్క రూపాయి చొప్పున విక్రయించి, మొత్తం రూ.1,262 మాత్రమే పొందాడు. అయితే, ఆ ఉల్లిని మార్కెట్కు తరలించడానికి లోడింగ్, రవాణా, తూకం కోసం రూ.1,263 ఖర్చు చేశాడు. దీంతో, పంటకు ప్రతిఫలం దక్కకపోగా, అదనంగా ఒక రూపాయి నష్టపోయిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. The post భారీగా పడిపోయిన ఉల్లి ధరలు appeared first on Navatelangana.



నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. అయితే మిత్ర పక్షాలు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో టీవీకే తేలిగ్గా బలపరీక్షను నెగ్గనుంది. టీవీకే మొత్తం 108 సీట్లు గెలవగా విజయ్ ఒకచోట రాజీనామా చేయడం, ఒక్క ఓటుతో గెలిచిన శ్రీనివాస్ ఫ్లోర్ టెస్టులో పాల్గొనవద్దని హెచ్ సీ చెప్పడంతో ఆ పార్టీ బలం 106కు పడిపోయింది. అయితే మిత్రపక్షాల మద్దతుతో 120కి పెరిగింది. 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు […] The post నేడే సీఎం విజయ్ బలపరీక్ష appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 889 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్లో 2,67,285 మంది, సెకండ్ ఇయర్లో 1,31,073 మంది, మొత్తం 3,98,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైనా ప్రవేశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలు మే 28వ తేదీ వరకు కొనసాగుతాయి. The post నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు appeared first on Navatelangana.





మన తెలంగాణ/హైదరాబాద్: నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు 16 టిఎంసీలు, శ్రీశైలం నుంచి తెలంగాణకు 6 టిఎంసీల నీళ్లు, ఎపికి సాగర్ నుంచి 10 టిఎంసీల నీటిని కేటాయించాలని కెఆర్ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. శ్రీశై లం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశం పై మంగళవారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కెఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరా లు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చిం చి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీశైలం, నా గార్జున సాగర్ల నుంచి నీటి విడుదలకు కెఆర్ఎంబి అంగీకారం తెలిపింది. తెలంగాణ, ఎపి తా గునీటి అవసరాల మేరకు నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక నిర్ణయం తీసుకుం ది. ఆగష్టు 15వ తేదీ వరకు ఈ ఒప్పందం అమ ల్లో ఉంటుందని కెఆర్ఎంబి పేర్కొంది. ఈనెల 14వ తేదీన మరోసారి దీనిపై చర్చించేందుకు కెఆర్ఎంబి సమావేశం కానుంది. ఇప్పటికే వాటాకు మించి వాడుకున్న ఆంధ్రప్రదేశ్శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి ఎపి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అధిక మొ త్తంలో నీటిని తరలిస్తోందని తెలంగాణ అధికారు లు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీ



మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు. కొనుగోళ్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు మిషన్ మోడ్లో పని చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలకు జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించి పరిష్కరించాలని సిఎం ఆదేశించారు. ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిని కలెక్టర్లు సమీక్షించాలని ఆయన సూచించారు. కొనుగోళ్ల అంశాన్ని తేలికగా తీసుకునే అధికారుల పై వెంటనే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పై సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లా

మనతెలంగాణ/హైదరాబాద్:పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే విధంగా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆనాటి ప్రభుత్వం నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి హైదరాబాద్లో నివసిస్తున్న వారికి కేటాయించడం వల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇళ్లు తీసుకున్న లబ్ధిదారులు అక్కడ నివసించడానికి సంసిద్ధతం వ్యక్తం చేయడం లేదని క్షేత్ర స్థాయి పరిశీలనల్లో స్పష్టమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశాన్ని ని ర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 02వ తేదీన) లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మొదటి విడత ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సి

న్యూఢిల్లీ : నీట్యూజీ పేపర్ లీక్ వ్యవహారంతో ఈనెల 3న జరిగిన పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్రంగా స్పందించారు. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పడిన కష్టం, వారి కలలు బీజేపీ సారథ్యం లోని అవినీతి వ్యవస్థ వల్ల చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారు. ఇంకొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండి చదివారు. ఇందుకు వారికి దక్కిన ప్రతిఫలం ఏంటంటే , పేపర్ లీకేజీలు, ప్రభుత్వ నిర్లక్షం, విద్యావ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి. ఇది కేవలం ఒక వైఫల్యం కాదు, దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా ఎలాంటి శిక్షలేకుండా తప్పించుకుని తిరుగుతుండగా, నిజాయతీ పరులైన విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి , ఆర్థిక పరమైన భారం, అస్థిరతను భరించాల్సి వస్తోంది. ఒకరి తలరాతను వారి శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తుంటే ఇక విద్యకు నిజమైన అర్థం ఏముంటుంది? ప

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా శుక్రవారం (మే14) నుంచి జూన్ 19 వరకూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఏ రోజున ఎవరేం చేయాలనే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 14న స్వయం సహాయక బృందాలతో పేరెం ట్స్, టీచర్స్ సమావేశం (పిటిఎం) నిర్వహించాలని, ఈ నెల 21న అంగన్వాడీ టీచర్లు, మ దర్స్ కమిటీలతో, ఈ నెల 28న యువత, నా యకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో స మన్వయం చేసుకుని అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్లు పైబడిన పిల్లలను గుర్తించి సమీప ప్రభు త్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించ డం, బడి ఈడు పిల్లలు, బాలలు, బాలకార్మికు లు, బడి బయటి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తారు. బడిబాటలో తల్లిదండ్రులు, స్వ చ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రాథమిక పా ఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ల తో మాట్లాడి, పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతు లు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బో ధన అందిస్తుండడంతో ప్రవ