
5178 articles

మేషంసన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. వృషభం కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. మిధునం కుటుంబ సభ్యులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. కర్కాటకం కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. నూతన ప్రయ

ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని, తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారం టూ టాలీవుడ్ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లా రు. మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నాగార్జున టీ షర్టులు మీరెలా అమ్ము తారు? అంటూ వ్యాపారిని ప్రశ్నించింది. ఫొటోలను వాణిజ్య పరంగా వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? అంటూ నిలదీసింది. వ్యా పారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ ’ది ఘోస్ట్’ సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని, కాబట్టి తమకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్ హౌస్తో తమకు ఒప్పందం ఉందని, నాగా ర్జున స్వయంగా ఆ వస్తువులను ప్రమోట్ చేశారని స్పష్టం చేశారు. దీనిపై నాగార్జున తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఒప్పంద పత్రాలు అడిగి నప్పటికీ సమర్పించలేదని, కోర్టుకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలు సైతం అసంపూర్ణంగా ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరికి, ఈ వ్యవహా రంలో తమకు నాగార్జునతో కానీ, సంబంధిత నిర్మాణ సంస్థతో కానీ ఎటువంటి ప్రత్యక్ష ఒప్పందం లేదని న్యాయస్థానం ముందు వ్యాపారి అంగీకారం తెలిపారు.

ఐపిఎల్లో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. రజడా, హోల్డర్ మూడేసి వికెట్లు తీసి గుజరాత్ను గెలిపించారు. హైదరాబాద్ టీమ్లో కమిన్స్ (19) టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు గుజరాత్ను ఓపెనర్ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్లు అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సాయి సుదర్శన్ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వాషింగ్టన్ అద్భుత ఇన్నింగ్స్తో అలరించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుందర్ 33 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్తో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో సాకిబ్, ప్రఫుల్ హింగె రెండేసి వికెట్లను పడగొట్టారు.

మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నాలుగు దశాబ్దాలుగా అడవుల్లో గెరిల్లా పోరాటం నడిపిన అగ్రనేత సరెండర్ కావడం మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతున్నది. కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి విద్యార్థి దశలోనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన ప్రయాణం క్రమంగా కేంద్రకమిటీ స్థాయికి చేరింది. జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ఆయన భార్య కూడా పార్టీలో ముఖ్య బాధ్యతల్లో ఉన్నారు. ఇటీవల జార్ఖండ్ సరండా అడవుల్లో భద్రత బలగాలు ముమ్మర కూంబింగ్ చేపట్టాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాను లక్షంగా చేసుకుని సాగుతున్న ఆపరేషన్లతో మావోయిస్టు శ్రేణులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో నరహరి దంపతులు లొంగుబాటు నిర్ణయ తీసుకున్నట్లు తెలుస్తున్నది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తల్లో, వ్యూహకర్తల్లో ఒకరిగా పేరున్న నరహరి లొంగిపోవడం తెలంగాణ, జార్ఖండ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల

జహీరాబాద్ బీదర్ రహదారి మరోసారి నెత్తురోడింది. శుభకార్యానికి వెళ్లాల్సిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది. మంగళవారం ఉదయం జహీరాబాద్ బీదర్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కర్ణాటకలోని హుమ్నాబాద్ ఆర్టీసీ డిపో బస్సు బీదర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో కర్ణాటక సరిహద్దులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మండల పరిధిలోని మిర్జాపూర్ (బి) గ్రామానికి చెందిన నర్సింలు (49), అరుణ్ (22) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బీదర్ సమీపంలోని కోటె గ్రామంలో జరిగే వివాహ వేడుకలకు హజరయ్యేందుకు బయల్దేరి గమ్యస్థానానికి చేరుతున్న తరుణంలో ప్రమాదం జరిగింది. ప్రమాద దాటికి బస్సు సైతం బోల్తా పడటంతో ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బీదర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్నీరు మున్నీరైన కుటుంబ సబ్యులు: ప్రమాదంలో మృత్యువాతకు గురైన వారి కుటుంబసబ్యులు చేసిన ఆర్తనాదాలు చూపరులను కలచివేశాయి. చేతికందిన కొడకు ఒకరైతే, కుటుంబపెద్దగా ఉన్న వ్యక్తి మరొకరు. ఈ ఇద్దరి మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు

తిరుమలాయపాలెం మండలం మేకలతండా శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపేడ బంగ్లా నుంచి ఖమ్మం నగరానికి వస్తున్న ఆలుగడ్డ లోడ్ లారీ, విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రకు బొగ్గు లోడ్తో వస్తున్న లారీని ఏకలవ్య నర్సరీ సమీపంలో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు లారీలు అతివేగంగా వస్తూ బలంగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించించింది. లారీలు ఢీకొన్న వెంటనే రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవర్లు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. లారీలో బొగ్గు ఉండటం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లకు స్వల్పగాయాలు కాగా, వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా కొంతసేపు వరంగల్ఖమ్మం రహదారిపై ట్రా
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న వేళ.. ఎరువుల కంపెనీలు అదను చూసి రైతులను దెబ్బకొట్టాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయంటూ దేశంలోని ఎరువుల కంపెనీలు ధరలను భారీగా పెంచేశాయి. ఈ ధరలు తక్షణం అమల్లోకొస్తాయని తెలిపాయి. అంతర్జాతీయంగా గ్యాస్, చమురు, ముడి సరుకుల ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను సాకుగా చూపి సబ్సిడీ పెంచాలని కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. కానీ, సబ్సిడీ పెంపునకు అంగీకరించకుండా కంపెనీలే ధరలు పెంచుకోవడానికి మోడీ సర్కార్ అనుమతినిచ్చింది. అంతర్జాతీయంగా […] The post దెబ్బమీద దెబ్బ appeared first on Navatelangana.

వీధి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు కొంతమంది చూసి గట్టిగా అరవడంతో కుక్కలు పారిపోయాయి. సిద్దిపేట జిల్లా బోటిమీదిపల్లికి చెందిన సుమన్ శ్రీవాణి దంపతులు కూమారుడు హాద్విక్ (7)తో కలిసి బీఎన్రెడ్డినగర్ డివిజన్ టీచర్స్ కాలనీలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 8.45 నిమిషాలకు బాలుడు వీధిలో ఆడుకుంటుండగా నాలుగైదు వీధికుక్కలు గుంపుగా వచ్చి ఒక్కసారిగా బాలుడిపై దాడిచేశాయి. దీంతో బాబు మొహానికి ,కాళ్లుచేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నదని, 48 గంటల అనంతరం పూర్తి ఆరోగ్య పరిస్థితిపై సృష్టత వచ్చే అవకాశం ఉన్నదని కామినేని ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు బుధ, గురు, శుక్రవారాల్లో చైనా పర్యటన జరిపేందుకు డోనాల్డ్ ట్రంప్ పూనుకున్నాడు.ఈ పర్యటన గురించి పెద్ద ఎత్తున ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషణలు వెలువడ్డాయి. పశ్చిమాసియా లో శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించాడు. అదొక చెత్తకాగితమని, దాన్నసలు పూర్తిగా చదవలేదంటూ తాత్కాలిక శాంతి అవగాహన వెంటిలేటర్ మీద ఉందని వ్యాఖ్యానించాడు. మరోసారి ఇరాన్పై దాడులకు తెగబడేందుకు […] The post కార్పొరేట్ల ఒత్తిడి-ట్రంప్ చైనా పర్యటన appeared first on Navatelangana.

భారత రాజకీయాల ప్రస్తుత దిశను గమనిస్తే, దేశం క్రమంగా ఒక ప్రమాదకర మలుపు వైపు నడుస్తోందన్న ఆందోళన పెరుగుతోంది. ఒకప్పుడు ప్రాంతీయ స్వాభిమానానికి, భాషా అస్తిత్వానికి, సామాజిక న్యాయ రాజకీయాలకు ప్రతీకలుగా నిలిచిన రాష్ట్రాలు ఇప్పుడు క్రమంగా కేంద్రీకృత రాజకీయాల ఒత్తిడిలో తమ స్వతంత్ర స్వరాన్ని కోల్పోతున్నాయి. దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ మార్పును మరింత స్పష్టంగా బయటపెట్టాయి. ప్రజాస్వా మ్యం ఇంకా కొనసాగుతున్నట్టే కనిపిస్తున్నా, దాని ఆత్మ క్రమంగా బలహీనపడు తోందనే భావన విస్తృతంగా […] The post మతోన్మాదం కింద నలుగుతున్న ప్రజాస్వామ్యం appeared first on Navatelangana.
భారతదేశంలో విద్య క్రమంగా వ్యాపార వస్తువుగా మారిపోతోందా? అంటే అవుననే అంటున్నారు విద్యావేత్తలు. ఎందుకంటే, కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే కాదు.. పలు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజులు తల్లిదండ్రులకు షాక్కు గురిచేస్తున్నాయి. అగ్రశ్రేణి స్కూళ్లమని చెప్పుకునే కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఫీజుల రూపంలో […] The post ఫీజులకు కళ్లెం ఇంకెప్పుడు? appeared first on Navatelangana.

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్ లోని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది. ముళ్ల తీగలకు ఢాకా భయపడదని ఆ దేశ విదేశాంగ శాఖ సలహాదారు ఎం.హెచ్. కబీర్ వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కబీర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు భారత్తో చర్చలు జరుపుతామని వెల్లడించారు. బెంగాల్లో కొత్త ప్రభుత్వం చేసిన ఎన్నికల వాగ్దానాలను తాము గమనిస్తున్నామన్నారు. భారత్ అంతర్గత రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదన్నారు. తమ సంబంధాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతో ఉంటాయన్నారు. ప్రస్తుతం సవాళ్లు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉండగా అధికారం లోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లో బంగ్లాదేశ్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేపడతామని బీజేపీ ఎన్నికల్లో బలంగా ప్రచారం చేసింది. ఆ దిశగా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన తొలి మంత్

‘వీరభద్రుడు’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు హీరో సూర్య సిద్ధమవుతున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో తెరకెక్కించింది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిలీజ్ అవుతుంది. ఈనెల 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో […] The post థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే పక్కా మాస్ ఎంటర్టైనర్ appeared first on Navatelangana.

ప్రశ్నాపత్రం లీక్తో నీట్ పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థుతి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డిఎ ప్రభుత్వ వైఫల్యం వల్లనే మరోసారి పేపర్ లీకైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని మండిపడ్డారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందని ఆక్షేపించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్త


సూర్య వశిష్ట, దీప్షిక జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను సహజనటి జయసుధ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,'ఈ సినిమా నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్తో ఈ సినిమాను తీశాడు. ఇది ఒక బ్యూటీఫుల్ ఫిల్మ్. […] The post మంచి ఫీల్ గుడ్ సినిమా appeared first on Navatelangana.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ షేరింగ్ తప్పనిసరిసింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, కొనసాగింపుకు సంబంధించి ప్రతిపాదిత ‘పర్సంటేజ్ షేరింగ్ విధానంఅమలుపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యుల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్తో పాటు పలువురు ఎగ్జిబిటర్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కీలక అంశాలు, నిర్ణయాలను వెల్లడించారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ,'నిర్మాత తండ్రి అయితే, ఎగ్జిబిటర్ బిడ్డలాంటివాడు. అలా చూసినప్పుడే సినిమా […] The post ఇది ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం appeared first on Navatelangana.

సువిక్షిత్, గీతికా రతన్ కొమ్మి జంటగా రూపొందిన ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు కార్తికేయ కొమ్మి మీడియాతో పలు చిత్ర విశేషాలను పంచుకున్నారు. నేను సాధ్యం, వసూల్ రాజా, లక్ష్మీబాంబ్ సినిమాలకు దర్శకత్వం చేశాను. కొత్తవాళ్లతో నేను చేసిన […] The post ఓ బిచ్చగాడి జీవితం స్ఫూర్తితో.. appeared first on Navatelangana.
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘ఆర్ కే దీక్ష. డి.ఎస్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్లో […] The post దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే? appeared first on Navatelangana.