
5248 articles


బీదర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్-జహీరాబాద్ రోడ్డుపై అదుపుతప్పిన కర్ణాటక ఆర్టీసీ బస్సు.. బైక్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు ప్రయాణికులు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బీదర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు సంగారెడ్డి జిల్లా నాల్కల్ కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు.. బీదర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




అమరావతి: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం అమలు చేయనున్నామని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరగనుందని, డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ తర్వాత 24 గంటల్లో ఆమోదం పొందనుందని, శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జరరేషన్ 24 గంటల్లో పూర్తికానుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రమే మినహాయింపు అని వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం అని మండిపల్లి తెలియజేశారు. సెలవు రోజుల్లో కూడా ఆన్ లైన్ ద్వారా ఆమోదం ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడుతున్నామని, ప్రజలకు పారదర్శక, సులభ సేవల దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.



హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం సాధించింది. పంజాబ్పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో ఓ కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. మాధవ్ తీవారి నాలుగు ఓవర్ల బౌలింగ్ చేసి రెండు మెయిన్ వికెట్లు పడగొట్టాడు. చివరలో బ్యాటింగ్ కు దిగిన మాధవ్ ఎనిమిది బంతుల్లో 18 పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించినందకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ జట్టులో ఆటగాడిగా అవకాశం ఇచ్చినందుకు జట్టు మేనేజ్మెంట్కు థ్యాంక్స్ చెప్పాడు. బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ సర్ తో బౌలింగ్ చేయడంలో చాలా కష్టపడ్డానని, ప్రతి ప్రాక్టీస్ సెషన్లో మెరుగుపరుచుకోవడమే తన లక్ష్యామన్నారు. తాను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం అద్భుతంగా ఉందని, ఈ వికెట్పై లెంగ్త్ బంతులు వేయడంతో పాటు వైడ్ బాల్స్, షార్ట్ బాల్స్ వేశానని వివరించాడు. రెండో ఓవర్లో ఎక్కువ పరుగులు ఇస్తే











తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిఎం విజయ్ నేతృత్వంలోని టివికె పార్టీకి మద్దతు విషయంలో అన్నాడిఎంకె పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. పళనిస్వామిని వ్యతిరేకిస్తూ అన్నాడిఎంకె రెబల్ వర్గం నేత షణ్ముగం, మరో నేత వేలుమణి.. ఎన్డియే కూటమికి గుడ్ బై చెప్పారు. అంతేకాదు, 24 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని కూడగట్టారు. మంగళవారం ఉదయం షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడిఎంకె మేజర్ ఎమ్మెల్యేలు.. విజయ్కి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఎన్డీఏ కూటమికి మాకు సంబంధం లేదు, మేం బయటికి వచ్చేశాం. మాదే అసలైన అన్నాడిఎంకె. డిఎంకెతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామి కుట్ర చేశారు. పళనిస్వామి ప్రతిపాదనను మేం అంగీకరించలేదు. పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డియే కూటమి నుంచి బయటకు వచ్చేశాం. వరుస ఓటములకు పళనిస్వామినే కారణం. పళనిస్వామి అన్ని పదవుల నుంచి దిగిపోవాలి అని షణ్ముగం పేర్కొన్నారు.మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీలో రేపు టివికె పార్టీ బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉంది. ఈ క్రమంలో అన్నాడిఎంకె రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించనున్నట్లు త

హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై టి.డి.ప్రసా ద్ వర్మ దర్శకత్వంలో ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి నిర్మిస్తోన్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, నటుడు అలీ, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఫణి సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ టి.డి.ప్రసాద్ వర్మ మాట్లాడుతూ “ఈ చిత్రం ఓ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులను అలరించనుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం”అని అన్నారు. నిర్మాతలు ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి మాట్లాడుతూ డైరెక్టర్ ప్రసాద్ వర్మ చెప్పిన వైవిధ్యమైన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్: భర్తను పొడిచి చంపిన కేసులో భార్యకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దంపతుల మధ్య గొడవ జరగడంతో భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. దీంతో ట్రయల్ కోర్టు భార్యకు నాలుగేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించింది. దీంతో భార్య హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ తిరుమలదేవి ఈడ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు విధించిన నాలుగేళ్ల శిక్షను రద్దు చేయడంతో రూ.500 జరిమానాతో ఈ కేసును ముగించింది. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి... భర్త పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకొచ్చాడు. దంపతుల మధ్య గొడవ జరగడంతో అతడు భయటకు వెళ్లిపోయాడు. అర్థనగ్నంతో ఇంట్లోకి వచ్చి భార్యతో పాటు ఆమెతల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషించాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని భార్య మెడలో పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. భర్త అత్యంత క్రూరంగా ఉండడంతోనే భర్తను చంపాలనే ఉద్దేశం మాత్రం లేదని పేర్కొంది. ఇరుగుపొరుగు సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, నిందితురాలు చూపించిన కత్తిని పోలీసులు కోర్టు ముందు ఉంచారు. భర్త అసభ్యకర ప్రవర్తనతోనే ఆకస్మిక ఆవ

హీరో రోహిత్ నారా తన తదుపరి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కరణ్.సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి ఆయన చేస్తున్న ఈ కొత్త చిత్రం బ్యానర్కి ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతోంది. ‘ఆర్ఎన్23’ ఫీల్గుడ్ రొమాంటిక్ కామెడీగా, ఆకట్టుకునే కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుంది. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే అందిస్తూ చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు షాట్కు కొరటాల శివ క్లాప్ కొట్టి, మేకర్స్ కు స్క్రిప్ట్ను అందజేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫస్ట్ షాట్ను డైరెక్ట్ చేయగా, సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్రేజీ హీరోయిన్ నయన్ సారిక ఈ చిత్రంలో రోహిత్ నారాకు జోడీగా నటిస్తోంది. అలాగే నరేష్ వికె, రోహిణి, సంపత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలతో ‘ఆర్ఎన్23’ రూపొందుతోంది. మూవీ లాంచింగ్ ఈవెంట్లో డైరెక్టర్ చినిమి