25310 articles

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేస్తున్నామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ప్రజలు పోరాడి స్వరాష్ట్రం సాధించుకున్నారు కానీ, తెలంగాణ వచ్చాక నిధులు, నియామకాలు కేవలం మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి దక్కాయని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద పిసిసి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలు తీసుకుంటున్న కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కెసిఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ..ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంతిళ్లు కట్టుకోవాలనే పేదల కల..పదేళ్ల పాటు నెరవేరలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి 2,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ..సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ విద్య, వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివితే సరిపోదని స

హైదరాబాద్: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మాధురి రాథోడ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. డోర్ పగలగొట్టి ఫ్యాన్కు వేలాడుతున్న రాథోడ్ను కుటుంబ సభ్యులు కాపాడారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాసింగ బలాలు వంటి వరస హిట్ పాటతో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే.

హైదరాబాద్: నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీగా మారింది. చాక్లెట్ ఇస్తానని బాలుడిని మహిళ ఎత్తుకెళ్లింది. ఆమెతో పాటు ఇంకొకరు వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయి 24 గంటలు గడిచిన బాలుడి ఆచూకీ లభించలేదు. ఏడు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఏదైనా ముఠా కిడ్నాప్ చేసింది? లేక పిల్లలు లేకపోవడంతో కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సంధ్య, నరేష్ అనే దంపతు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడో కాన్పు కోసం నిజామాబాద్లో జిజిహెచ్లో చేరారు. నరేష్ తన ఇద్దరు పిల్లలతో కలిసి టీ తాగాడు. గ్లాసులను పక్క డస్ట్ బీన్ లో వేసేందుకు ముందుకు వెళ్లాడు. ఓ మహిళ చాక్లెట్ ఇస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లింది. మూడేళ్ల వేదాన్ష్ ఆమె వెంట వెళ్లాడు. ఐదేళ్ల నియాన్ష్ తల్లి వద్దకు వెళ్లి చెప్పడంతో ఆస్పత్రిలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


హైదరాబాద్: తమ పదవులకు ఎసరొస్తుందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ భయపడుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. పచ్చ కాంగ్రెస్ పెత్తనం పెరుగుతుందని అచ్చ కాంగ్రెస్ కు భయం అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే వాళ్లు ధర్నాలు చేస్తున్నారని, అంతర్గత సంక్షేభం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ధర్నా డ్రామా అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కొండా సురేఖతో మొదలైన సంక్షేభం కొనసాగుతుందని తెలియజేశారు. హామీలు నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, సమయానికి నరసింహస్వామి ఏం చేశారో మాజీ సిఎం కెసిఆర్ అలా చేస్తారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.




భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో మద్యం తాగి పది మంది దుర్మరణం చెందారు. బండా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌరోజా, డోగ్రా, బరాజ్, బెమురా బేడా గ్రామాలకు చెందిన 50 మంది మందుబాబులు మద్యం తాగి వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పది మంది చనిపోయారు. 40 మంది వరకు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురైనవారిని మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యంలో విషపూరిత రసాయనం కలిసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతల చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 163వ నవంబర్ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీని బలంగా ఢీకొట్టడంతో మంటలు ఎగసిపడి కారు దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనంతో పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బిఆర్ఎస్ నేతలతో రోడ్లపై మాట్లాడించటం కాదని..సభకు వస్తే సమాధానం చెప్తామని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద పిసిసి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీతభత్యాలు తీసుకుంటున్న కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని కాంగ్రెస్ విమర్శలు చేసింది. కెసిఆర్ ప్రజాధనం ఖర్చు చేస్తూ..ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు సిఎంగా పనిచేసిన కెసిఆర్ సభకు వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాలని, విపక్షలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు. ఆర్టిసి బస్సుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉచిత ప్రయాణం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డు కూడా దౌర్భాగ్య పాలన పదేళ్ల పాటు సాగిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకుడి వైఖరి మారకుంటే.. మరో పదేళ్లు కూడా వాళ్లు రోడ్ల మీద ఉంటారని హెచ్చరించారు. ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు డిమాండ్

మాస్ మహరాజ రవితేజ నటించిన రీసెంట్ చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.200+ కోట్లు వసూళ్లు చేసింది. కుటుంబ భావోద్వేగాలు, తండ్రి కుమార్తె సెంటిమెంట్ తదితర అంశాలను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాలో పాటలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ప్రత్యేకమైన వీడియో సాంగ్ని విడుదల చేశారు. ‘కార్తీకమాసం’ అంటూ సాగే ఈ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. అయ్యప్ప స్వామి దీక్ష విశిష్టతను తెలియజేస్తూ సాగే ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. మద్యపాన అలవాటును మానుకొని దీక్షను కొనసాగించడానికి రవితేజ పాత్ర చూపే పట్టుదల ఇందులో కనిపిస్తోంది. జివి ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ రాయడం విశేషం.




కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ సర్కిల్ లో బిఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో డీజిల్ లేక చెత్త వాహనాలు ఆగిపోవడంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించకపోవడంతో ఆ చెత్తను తెచ్చి సర్కిల్ కార్యాలయంలో గులాబీ నేతలు పడేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగ రాయ ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తామే స్వయంగా చెత్తను సంచులో నింపుకొని తీసుకువచ్చి డిప్యూటీ సర్కిల్ కార్యాలయం ముందు వేసి బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసిలో సిఎంసిలో తమ ప్రాంతాన్ని కలిపినా ప్రజల కష్టాలు తీరటంలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫోన్లు ఎత్తటం లేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు ఇలా ఉందని దుయ్యబట్టారు. గతంలో కెటిఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సమస్య ట్విట్టర్ లో పెడితే 15 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయ్యేదని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖను చూస్తున్న ఎక్కడ వేసిన గోంగడి అక్క



హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నామాజీ సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలని కోరడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో 22ఎ పై పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారని, ఈ చిల్లర చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చలేరని సూచించారు. సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారని, గతంలో రెండుసార్లు సిద్దిపేటకు వచ్చి ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తలకిందులు చేసినా, పొర్లు దండాలు పెట్టినా సిద్దిపేట ప్రజలు రేవంత్ ను నమ్మరని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల ఇస్తామని వెయ్యి రోజుల్లో కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు.

Virat Kohli Announces Retirement from Test Cricket
RRR 2: SS Rajamouli Officially Announces Sequel