
5078 articles
‘‘తల్లిగా మారడం నా పిల్లల, నా కుటుంబం, నా భవిష్యత్తు గురించి భిన్నంగా ఆలోచించేలా చేసింది. ఇతరులకు సహాయం చేసే ముందు మీ సీట్బెల్ట్ మీరే పెట్టుకోవాలని చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆర్థికంగా స్థిరపడిన మహిళ, తాను ప్రేమించే ప్రతిఒక్కరికీ మరింత మెరుగ్గా అండగా నిలుస్తుంది. ఆ గ్రహింపే Lxmeకు ఇంధనంగా మారింది. ఒక కుటుంబంలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తరచుగా నిశ్శబ్దంగా, గుర్తింపు లేకుండా తీసుకోబడతాయి. సాధారణంగా ఆ నిర్ణయాలను మహిళలే తీసుకుంటారు. మేము […] The post నన్ను భిన్నంగా ఆలోచించేలా చేసింది appeared first on Navatelangana.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రస్టిక్ స్పోర్ట్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్లో చరణ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ వండర్గా రూపొందించారు. ఇప్పుడు ఆ ఆసక్తిని మరింత పెంచుతూ ముంబై, భోపాల్ నగరాల్లో రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా సినిమా భారీ కాన్వాస్ను జాతీయ మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ముంబై ట్రైలర్ లాంచ్ తర్వాత, చిత్ర బృందం ఈ కథ మూలాలను సెలబ్రేట్ చేయడానికి హార్ట్ అఫ్ ఇండియా గా పిలిచే భోపాల్కు వెళ్లనుంది. మే 23న అక్కడ స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ను మరింత ప్రత్యేకంగా మార్చేలా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వయంగా ‘పెద్ది’ పాటలను లైవ్లో పర్ఫార్మ్ చేయనున్నారు. అలాగే సౌండ్
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా గడ్డపై కాలుమోపారు. బుధవారం ఆయన బీజింగ్ చేరుకున్నారు. దాదాపు ఒక దశాబ్దం తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. బీజింగ్ క్యాపిటల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్కు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ సైనిక గౌరవ వందనంతో ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, […] The post చైనాలో అడుగుపెట్టిన ట్రంప్ appeared first on Navatelangana.


ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ను తెలియజేస్తూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సమంత చీరకట్టులో ఆ గన్ను పట్టుకున్న తీరు, ఆ చూస్తున్న చూపులు అదిరిపోయాయి. వేటకు వెళ్తున్న సివంగిలా సమంత లుక్ కనిపిస్తోంది.


మిళనాడు అసెంబ్లీలో బుధవారం విజయ్ సారథ్య టివికె ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మెజార్టీ నిరూపణకు అవసరం అయిన విశేష సంఖ్యా బలాన్నిన దాటి విజయ్ తమ బలం నిరూపించుకున్నారు. దీనితో హీరో అయిన విజయ్ ప్రభుత్వం తొలి అడ్డంకులను అధిగమించింది. 144ః22 తేడాతో బల నిరూపణ జరిగినట్లు అసెంబ్లీ స్పీకర్ జెసిడి ప్రభాకర్ ఓటు తరువాత అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఐదుగురు తటస్థ వైఖరితో ఉన్నారు. అయితే బలపరీక్షసమయంలో ప్రధాన ప్రతిపక్షం డిఎంకె వాకౌట్కు దిగింది. ఇక కీలక పరిణామంగా ప్రతిపక్ష అన్నాడిఎంకెలోని చీలిక వర్గం ఎమ్మెల్యేలు విజయ్కు అనుకూలంగా ఓటేశారు. దీనితో ఇకపై అన్నాడిఎంకె వేర్వేరు కుంపట్లతో ముందుకు రానుంది. సి జోసెఫ్ విజయ్ నాయకత్వ ప్రభుత్వం విశ్వాస పరీక్ష లో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పడి కె పళనిస్వామి వర్గీయులు వ్యతిరేక ఓటేశారు.విజయ్ తమ చీలిక వర్గంతో బలం నిరూపించుకోవడం సమంజసమేనా అని పళనిస్వామి విమర్శించారు.234 మంది సభ్యుల అసెంబ్లీలో మెజార్టీ బలం 118. గవర్నర్ వద్దకు విజయ్ ఈ బలంతో వెళ్లి, తరువాత ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయన బలం
నవతెలంగాణ – హైదరాబాద్: ధనవంతులకు, విద్యార్థులకు ఓ యువతి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా సాగర్కు చెందిన 21 ఏళ్ల సుహానా.. ఉడిపి జిల్లా కుందాపురలోని ఓ ప్రముఖ కళాశాలలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చెన్నై నుంచి గంజాయిని తీసుకువచ్చి మంగళూరులోని కాలేజీ విద్యార్థులు, యవకులు, ధనవంతులకు అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పనంబూరు, ముల్కి పోలీసులు సంయుక్తంగా […] The post గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ విద్యార్థిని appeared first on Navatelangana.



బషీరాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి చెందిన రమణి నరేష్ (25) అనే యువకుడు మాయమాటలు చెప్పి సమీపంలోని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఘటన అనంతరం బాలిక తీవ్ర భయాందోళనకు గురై ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు వెంటనే బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న బషీరాబాద్ ఎస్ఐ విఠల్ తన సిబ్బందితో వెంటనే గ్రామానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై నిందితుడు రమణి నరేష్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఘటన విషయం ఆ గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో జినుకల సారయ్య కుమార్తె వివాహం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. The post నూతన దంపతులను ఆశీర్వదించిన సర్పంచ్ శ్రీనివాస్ appeared first on Navatelangana.

పాల్వంచ మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకున్నది. పాల్వంచలోని బొల్లోరిగూడెం ప్రాంతంలో ఓ పసికందు తలభాగం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం బొల్లోరిగూడెం ప్రాంతంలో వీధి కుక్కలు ఏదో పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లిచూడగా, ఒక పసికందు తలభాగాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యం కనిపించింది. ఈ భయానక దృశ్యాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన జనం కుక్కలను అక్కడినుంచి తరిమివేశారు. సమాచారం అందుకున్న పాల్వంచ పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు తల భాగాన్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ పసికందు ఎవరనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు శిశువును చంపి ఇక్కడ పడేశారా, లేక మృతదేహాన్ని కుక్కలు ఎక్కడైనా శ్మశానం నుంచి తీసుకువచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల జరిగిన ప్రసవాల గురించి పట్టణ ఎస్సై నాగరాజు ఆరా తీస్తున్నట్టు సమాచారం.


రాయ్పూర్: వరుస విజయాలతో జోరుమీదున్న కోల్కతా నైట్రైడర్స్ బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రాయ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుపడుతోంది. వర్షం కారణంగా స్టేడియం తడిసిపోయింది. ప్రస్తుతం వర్షం ఆగిపోయినా.. స్టేడియం తడిగా ఉండటంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు.కాగా, ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కోల్కతా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిందే. రాజస్థాన్, లక్నో, హైదరాబాద్, ఢిల్లీ బలమైన జట్లను ఓడించి.. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలవడంతో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగానే ఉంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు.ఇక బెంగళూరులోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. విరాట్ కోహ్లి, పడిక్కల్, కెప్టెన్ రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, జితేశ్ శర్మ, షెఫర్డ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులోఉన్నారు. కోహ్లి, పడిక్కల్, రజత్, డేవిడ్ తదితరులు ఫామ్లో ఉండడం జట

పనకబండ మాజీ సర్పంచ్ ,మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు , మాజీ సింగల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని హనుమంతు గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం హనుమంతు భౌతికకాయాన్ని సందర్శించి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పోన్నె బోయిన రమేష్ ,మాజీ మార్కెట్ చైర్మన్లు కొణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మెఘారెడ్డి ,అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్ ,పానుగుల్ల విష్ణుమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షులు లోతకుంట స్వామి, మాజీ సర్పంచ్లు బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్ ,ఎలుగు సోమయ్య, నాయకులు పోన్నెబోయిన నర్సయ్య, పైళ్ల బుచ్చయ్య, పోన్నెబోయిన అంజయ్య ,బత్తిని అంజయ్య ,పోన్నె బోయిన మచ్చగిరి ,పైళ్ల రమేష్ ,బత్తిని మహేష్, కనేబోయిన లింగం, వల్లందాస్ బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.


మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్లు లీక్ చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకార్డులతో నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే NEET-2026 పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీ ఘటన అత్యంత దారుణమైనదని , ఆందోళనకరమైనదన్నారు. పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మే 3వ తేదీన నిర్వహించిన నీట్ 2026 పరీక్షలో పేపర్ లీకేజీ, భారీ అక్రమాలు జరగటం బాధాకరమని,దీనివలన 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగటమడిందన్నారు.పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం, తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడం దేశ పరీక్షా వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైందని స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై విద్యార్థుల వి


చెన్నై: ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలుగా మారిన వేలుమణి, షణ్ముగంలకు పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి వేటు వేశారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస ఓటుపై పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు బుధవారం పార్టీ నాయకులు వేలుమణి, షణ్ముగం, సి విజయభాస్కర్, నాతం ఆర్ విశ్వనాథన్తో సహా పలువురు ఇతర నాయకులనువారి పదవుల నుంచి తొలగించారు. కాగా, తమిళనాడులో నాలుగు రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం, బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస ఓటును గెలుచుకుని తన మొదటి ప్రధాన పరీక్షను విజయవంతంగా అధిగమించింది. ఏఐఏడీఎంకేకు చెందిన 25 మంది రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ సభ విశ్వాసాన్ని పొందారు. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 59 మంది సభ్యులున్న ప్రతిపక్ష డీఎంకే నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది.

