25317 articles


కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ సర్కిల్ లో బిఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో డీజిల్ లేక చెత్త వాహనాలు ఆగిపోవడంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించకపోవడంతో ఆ చెత్తను తెచ్చి సర్కిల్ కార్యాలయంలో గులాబీ నేతలు పడేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగ రాయ ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తామే స్వయంగా చెత్తను సంచులో నింపుకొని తీసుకువచ్చి డిప్యూటీ సర్కిల్ కార్యాలయం ముందు వేసి బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసిలో సిఎంసిలో తమ ప్రాంతాన్ని కలిపినా ప్రజల కష్టాలు తీరటంలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫోన్లు ఎత్తటం లేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు ఇలా ఉందని దుయ్యబట్టారు. గతంలో కెటిఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సమస్య ట్విట్టర్ లో పెడితే 15 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయ్యేదని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖను చూస్తున్న ఎక్కడ వేసిన గోంగడి అక్క



హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నామాజీ సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలని కోరడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో 22ఎ పై పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారని, ఈ చిల్లర చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చలేరని సూచించారు. సిద్దిపేటలో దండయాత్ర చేస్తానని సిఎం చెబుతున్నారని, గతంలో రెండుసార్లు సిద్దిపేటకు వచ్చి ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తలకిందులు చేసినా, పొర్లు దండాలు పెట్టినా సిద్దిపేట ప్రజలు రేవంత్ ను నమ్మరని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల ఇస్తామని వెయ్యి రోజుల్లో కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు.




యోగ్యాకార్టా : ఇండోనేషియాలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం ఉదయం భారీ స్థాయిలో లావాను విరజిమ్మింది. దాదాపుగా యాబై వేల ఎత్తు అడుగుల వరకు పొగ కమ్ముకోవడంతో విపరీతమైన వేడి, కాలుష్యం ఏర్పడింది. దీంతో పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. పర్వతారోహకులు, టూరిస్టులను నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున బూడిద ఎగసి పడడంతో సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని సర్వీసులను రద్దు చేశామని ఇండోనేషియా సౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. దాదాపు 209 విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో 23 వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.


న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరిలో ఎంసిఎక్స్ మార్కెట్లో కిలో రూ.4 లక్షల మార్కును దాటిన వెండి ధరలు, గత ఏడు నెలలుగా వరుసగా క్షీణిస్తూ ప్రస్తుతం 40% పైగా పడిపోయాయి. ముంబై స్పాట్ మార్కెట్లో వెండి ధర కిలో రూ. 2.35 లక్షలకు చేరుకుంది. గతంలో ఏడాది వ్యవధిలోనే 300% పైగా ధరలు పెరిగిన సమయంతో పోలిస్తే ఇప్పుడు వెండి భారీ క్షీణతను చూసింది. ధరలు తీవ్రంగా తగ్గినప్పటికీ, కొత్తగా కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. గతంలో అధిక ధర వద్ద వెండి నాణాలు, బిస్కెట్లు, వెండి ఇటిఎఫ్లు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ప్రస్తుతం భారీ నష్టాల్లో కూరుకుపోయారు. మరోవైపు పండుగల సీజన్ దగ్గరపడుతున్నా డిమాండ్ లేకపోవడంతో వ్యాపారుల వద్ద సరుకు నిల్వలు పేరుకుపోతున్నాయి. భారత బులియన్ డీలర్లు, రిఫైనరీలు విదేశాల నుంచి ఆర్డర్ చేసిన దాదాపు 2,000 టన్నుల వెండి ప్రస్తుతం భారత్కు వస్తోంది. భారత్ ప్రతి సంవత్సరం సుమారు 7,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త నిల్వలను కొనేవారు లేక గోదాముల్లోనే ఉండిపోతాయని డీలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూలియస్ బేయర్ నెకస్ట్ జనరేషన్ రీసెర్చ్ హెడ్ కార్సెన్ మెన్కే మాట్లాడుతూ,






సిద్దిపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన ఆకు బత్తిని పవన్ గత ఏడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసతున్నారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలోని పవన్ ఉరేసుకున్నాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల వేధింపులా? లేక వ్యక్తిగత కారణాలా? అనే కోణం పోలీసులు విచారణ చేస్తున్నారు.






Virat Kohli Announces Retirement from Test Cricket
RRR 2: SS Rajamouli Officially Announces Sequel