
5088 articles


రాయ్పూర్: వరుస విజయాలతో జోరుమీదున్న కోల్కతా నైట్రైడర్స్ బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రాయ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుపడుతోంది. వర్షం కారణంగా స్టేడియం తడిసిపోయింది. ప్రస్తుతం వర్షం ఆగిపోయినా.. స్టేడియం తడిగా ఉండటంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు.కాగా, ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కోల్కతా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిందే. రాజస్థాన్, లక్నో, హైదరాబాద్, ఢిల్లీ బలమైన జట్లను ఓడించి.. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలవడంతో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగానే ఉంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు.ఇక బెంగళూరులోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. విరాట్ కోహ్లి, పడిక్కల్, కెప్టెన్ రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, జితేశ్ శర్మ, షెఫర్డ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులోఉన్నారు. కోహ్లి, పడిక్కల్, రజత్, డేవిడ్ తదితరులు ఫామ్లో ఉండడం జట

పనకబండ మాజీ సర్పంచ్ ,మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు , మాజీ సింగల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని హనుమంతు గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం హనుమంతు భౌతికకాయాన్ని సందర్శించి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పోన్నె బోయిన రమేష్ ,మాజీ మార్కెట్ చైర్మన్లు కొణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మెఘారెడ్డి ,అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్ ,పానుగుల్ల విష్ణుమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షులు లోతకుంట స్వామి, మాజీ సర్పంచ్లు బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్ ,ఎలుగు సోమయ్య, నాయకులు పోన్నెబోయిన నర్సయ్య, పైళ్ల బుచ్చయ్య, పోన్నెబోయిన అంజయ్య ,బత్తిని అంజయ్య ,పోన్నె బోయిన మచ్చగిరి ,పైళ్ల రమేష్ ,బత్తిని మహేష్, కనేబోయిన లింగం, వల్లందాస్ బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.


మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్లు లీక్ చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకార్డులతో నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే NEET-2026 పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీ ఘటన అత్యంత దారుణమైనదని , ఆందోళనకరమైనదన్నారు. పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మే 3వ తేదీన నిర్వహించిన నీట్ 2026 పరీక్షలో పేపర్ లీకేజీ, భారీ అక్రమాలు జరగటం బాధాకరమని,దీనివలన 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగటమడిందన్నారు.పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం బయటకు రావడం, అనేక ప్రశ్నలు అసలు పరీక్షతో సరిపోవడం, తదనంతరం పరీక్ష రద్దు వరకు వెళ్లడం దేశ పరీక్షా వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైందని స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై విద్యార్థుల వి


చెన్నై: ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలుగా మారిన వేలుమణి, షణ్ముగంలకు పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి వేటు వేశారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస ఓటుపై పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు బుధవారం పార్టీ నాయకులు వేలుమణి, షణ్ముగం, సి విజయభాస్కర్, నాతం ఆర్ విశ్వనాథన్తో సహా పలువురు ఇతర నాయకులనువారి పదవుల నుంచి తొలగించారు. కాగా, తమిళనాడులో నాలుగు రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం, బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస ఓటును గెలుచుకుని తన మొదటి ప్రధాన పరీక్షను విజయవంతంగా అధిగమించింది. ఏఐఏడీఎంకేకు చెందిన 25 మంది రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ సభ విశ్వాసాన్ని పొందారు. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 59 మంది సభ్యులున్న ప్రతిపక్ష డీఎంకే నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది.



అహ్మదాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) షాకిచ్చింది. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(మే 12) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత కమిన్స్ కు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ సమయంలో స్లో ఓవర్-రేట్ను కొనసాగించినట్లు తేలడంతో, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కమిన్స్ కు12 లక్షల రూపాయల జరిమానా విధించింది. కాగా, ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై హైదరాబాద్ 82 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో విరుచుకుపడిన గుజరాత్ పేసర్ల ముందు సన్ రైజర్స్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. కేవలం 169 పరుగుల లక్ష్య ఛేదనలో ఫేవరెట్గా బరిలోకి దిగిన హైదరాబాద్.. టాప్ ఆర్డర్ అవుటైన తర్వాత పేకముక్కల్లా వికెట్లు కోల్పోయింది. ఒత్తిడిని తట్టుకోవడంలో మిడిల్ ఆర్డర్ విఫల్ కావడంతో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడా, జాసన్ హోల్డర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చే


పైరసీ భూతం టాలీవుడ్ను వీడటం లేదు. ఒకవైపు డిజిటల్ విప్లవం, మరోవైపు పైరసీ సైట్ల దాడితో కుదేలవు తున్న టాలీవుడ్కు ’ఐబొమ్మ’ రూపంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి అరెస్ట్ కావడంతో ఇక ఐబొమ్మ అధ్యాయం ముగిసిందని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా రవి బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే ఆన్లైన్లో మళ్లీ ఈ సైట్ ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. యాక్టివిటీ లేని ఈ వెబ్ సైట్ నుంచి ఇప్పుడు మళ్లీ వరుసగా కొత్త సినిమాలు రావడం మొదలైంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పుడు ఈ ఐ బొమ్మ వెబ్ సైట్ ను మళ్లీ ఎవరు మొదలు పెట్టారు? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. గతంలో ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పైరసీకి అడ్డుకట్ట పడుతుందని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అప్ప ట్లో సైట్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే, తాజాగా వెబ్సైట్ పునరుద్ధరించబడటమే కాకుండా, థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలు సైతం అందు లో ప్రత్యక్షమవ్వడం పట్ల సినీ పెద్దలు విస


తమిళనాడు ముఖ్యమంత్రి జోసెప్ విజయ్ నీట్ (NEET) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. నీట్ వంటి పరీక్షల వల్ల రాష్ట్రాల విద్యా హక్కులకు భంగం కలుగుతోందని , భారీగా ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద, గ్రామీణ విద్యార్థులకు ఈ పరీక్ష శాపంగా మారిందని ఆయన అన్నారు. విభిన్న రాష్ట్రాల్లో విభిన్న విద్యా విధానాలు (Syllabus) ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.12 వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి సిఎం విజయ్ విజ్ఞప్తి చేశారు. నీట్ నుండి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఆయన తన మద్దతును ప్రకటించారు.




వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పావుల్నవతెలంగాణ – ఆలేరు రూరల్ విబిజిఆర్ఎస్ఏఎంజి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పావుల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2026 మే 15న నిర్వహించే దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద […] The post ఉపాధి హామీ రక్షణకై దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి appeared first on Navatelangana.
భూగర్భ జలాలు కాపాడాలిసీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజునవతెలంగాణ – కంది మండలంలోని నక్కవాగు ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని, భూగర్భ జలాలను కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్కవాగు పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్న అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. […] The post నక్కవాగు ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సంఘర్షణ కొనసాగితే, ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాల్సి రావచ్చని మల్హోత్రా అన్నారు. మంగళవారం స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంయుక్తంగా నిర్వహించిన ఒక సమావేశంలో మల్హోత్రా అన్నారు. దీనికి ఒక రోజు ముందు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు […] The post పెట్రోల్-డీజిల్ ధరలపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు appeared first on Navatelangana.

న్యూయార్క్: అమెరికాలోని ఓ ఆంధ్రా యువతి అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. ఆంధ్ర్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన పిట్ట లోకేశ్వరి(28) గత కొంతకాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. లుకేమియా శృతిమించడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె సొంతగ్రామం పిట్టువారిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి. నార్త్ వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. యువతి మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టు లో తగ్గుతున్న నీటిమట్టం విద్యుత్తు ఉత్పత్తిని నిలిపిన అధికారులునవతెలంగాణ-అచ్చంపేట(నీలం సంజీవ రెడ్డి సాగర్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిపై నల్లమల కొండలలో నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. ఇది 512 మీటర్ల పొడవు, 145 మీటర్ల ఎత్తుతో, 12 రేడియల్ క్రస్ట్ గేట్లతో నిండిన జలాశయం. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి (770 MW + 900 MW) మరియు ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం పనిచేస్తుంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాల సరిహద్దులో ఉంది. […] The post అడుగంటుతున్న కృష్ణమ్మ appeared first on Navatelangana.