హైదరాబాద్‌ ఉప్పల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వారసిగూడకు చెందిన 26 ఏళ్ల హేమంత్‌ సాగర్‌ ఓయో హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ యువతి తనను మోసం చేసిందనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.