హ్యూస్టన్లోని తెలుగు క్రీడాభిమానులకు శుభవార్త. హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) తన 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకంగా TPL (TCA Premier League) క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తోంది. తెలుగు కమ్యూనిటీని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ మెగా క్రీడా సంబరం జూలై 18, 2026న జరగనుంది.
టోర్నమెంట్ టెక్సాస్లోని సైప్రస్ (Cypress) ప్రాంతంలోని JPL క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ప్రతిభావంతమైన జట్లు పాల్గొని తమ క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఈ టోర్నమెంట్ ద్వారా లభించనుంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో పాటు కమ్యూనిటీ సభ్యులకు వినోదభరితమైన అనుభవాన్ని అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ టోర్నమెంట్ను TCA అధ్యక్షుడు యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో, కన్వీనర్ జితేందర్ రెడ్డి సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ఆసక్తి ఉన్న జట్లు త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
హ్యూస్టన్ తెలుగు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించే ఈ TPL క్రికెట్ టోర్నమెంట్ 50 ఏళ్ల స్వర్ణోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.











