మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఆర్‌టిసి ఎక్స్ రోడ్స్‌లో ఏఎస్‌బిఎల్ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్ ఎఎస్‌బిఎల్ లెగసీని ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఇదే మొదటి గేటెడ్ కమ్యూనిటీ, అత్యంత ఎత్తైన నిర్మాణం కావడం గమనార్హం. 7.97 ఎకరాలలో, జి+50 అంతస్తులతో 3 టవర్లుగా దీనిని నిర్మిస్తున్నారు. రూ. 1.99 కోట్ల ప్రా రంభ ధరతో 3, 4 బిహెచ్‌కె ఇళ్లను అందిస్తున్నారు. దీనిలో 73.25% ఖాళీ స్థలం, 74,000 చ.అడుగుల క్లబ్‌హౌస్, 1.70 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో 50కి పైగా సౌకర్యాలు ఉన్నాయి. ఇది మెట్రో స్టేషన్‌కు 2 నిమిషాలు, కాచిగూడ స్టేషన్‌కు 8 నిమిషాలు, ఎంజిబిఎస్‌కు 15 నిమిషాల దూ రంలో ఉంది. సెంట్రల్ హైదరాబాద్‌లో డి మాండ్ ఉన్నప్పటికీ, పెద్ద స్థలాలు లేకపోవడం వల్లే నాణ్యమైన ఇళ్ల కొరత ఉందని ఎఎస్‌బిఎల్ సిఇఒ అజితేష్ కొరుపోలు తెలిపారు.