నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కేంద్రం వేధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీలు ఆపలేరు కాని, దిల్లీలో మెట్రోలు, రోడ్లను మూసివేస్తారని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడుతోన్న విద్యార్థులపై కేంద్రం క్రూరమైన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవస్థలోని లోపాలను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు కోరుతున్నారని, ఆయన శాఖ మార్చడం కాదన్నారు. విద్యార్థులతో మోదీ వీడియోల ద్వారా ఆటలాడుతున్నారని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు.
The post అన్నీ మూసేస్తారు.. కానీ లీక్ను మాత్రం ఆపలేరు: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.









