
తిరుపతి: టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడంతో స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు.











