మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర అన్ని రకాల గురుకులాల్లో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహించేందుకు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకు మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతించింది. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రవేశాల గడువును మరో 15 రోజులపాటు ఇంటర్ బోర్డు పొడిగించింది.