చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. గడియారం స్తంభం సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు అతివేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, పాదచారులను ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.