
అమరావతి: ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో మెగా పేరెంట్స్ మీటింగ్కు హాజరైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డలో పంచాయతీ పరిధిలో జరిగింది. జరిగింది. కెవి రమణ అనే వ్యక్తి పినపాడు గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మెగా పేరంట్స్ మీటింగ్ ఉండడంతో విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు. మద్యం మత్తులో ఊగుతూ మీటింగ్కు హాజరయ్యాడు. బెంచీపై పడిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో పిల్లలకు ఎలా చదువు చెబుతారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, విధ్యాశాఖ అధికారులకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.











