
హైదరాబాద్: గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని విద్యార్థుల జీవితంతో ఆటలాడుతోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గ్లోబరీనా సంస్థ ఆనాడు విద్యార్థుల చావుకు కారణమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా సంస్థ రిపోర్టును బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు? అని 28 మంది విద్యార్థులు ప్రాణాలు పోవడానికి గ్లోబరీనా సంస్థ కారణం కాదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గ్లోబరీనాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని, నీట్ పేపర్ లీక్ అయిన నెలన్నరకు కెటిఆర్ నిద్రలేచారని విమర్శించారు. బిఆర్ఎస్ డ్రామాలో విద్యార్థులు భాగం కావొద్దు అని మహేష్ గౌడ్ సూచించారు.











