
హైదరాబాద్: రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజునే శ్రావణ శుక్రవారం రావడంతో పూజలు విశేషంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. పరకాల వివాదం తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ వచ్చారు. రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.











