హైదరాబాద్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో దారుణం జరిగింది. తమ్ముడి కుమారుడి దాడిలో పెదనాన్న ప్రాణాలు కోల్పోయాడు. సాంబరెడ్డి అనే వ్యక్తి మానసిక దివ్యాంగుడు. తమ్ముడు కుమారుడు రాజు అనే వ్యక్తి అర్థరాత్రి మద్యం మత్తులో కర్రతో పెదనాన్న సాంబరెడ్డిపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. నాచినపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.