22711 వార్తలు










ఢిల్లీ: ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో తొలి అడుగు పడిందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు...దేశవ్యాపంగా విద్యార్థుల పోరాటం చూసి గర్విస్తున్నానని, అణచివేతకు గురైన ఏ వర్గమైనా ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు. వీధుల్లోకి వచ్చి పోరాడిన యువత, విద్యార్థులకు రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. మరో రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిపై విచారణ జరపాలని రాహుల్ గాంధీ అన్నారు.




ఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని సిజెపి నేతలు తెలిపారు. మిగతా 3 డిమాండ్లు కూడా నెరవేరేవరకు వేచి ఉందాం అని అన్నారు. ఈ సందర్భంగా సిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిజెపి నేతలు సూచించారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, దాడిచేసిన పోలీసు అధికారులు తమకు క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన చేసేవరకు ఈ ఉద్యమం ఆగదని, సాయంత్రం 6.గం.లకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తమకు రాజకీయాలు అవసరం లేదని సిజెపి నేతలు పేర్కొన్నారు.








