22690 వార్తలు


న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నీట్ (యూజీ) పరీక్షలో జరిగిన అవకతవకల కారణంగా సిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర రాజీనామాతోపాటు, మరో రెండు డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు జెపి నడ్డా, జితేంద్ర సింగ్ ల పిలుపు మేరకు సీజేపీతో ప్రతినిధులు వారితో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిజెపి ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రధానంగా మూడు డిమాండ్లపై కేంద్రంతో చర్చించామని... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని తెలిపారు. ఢిల్లీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. నిరసనకారులపై భవిష్యత్తులోనూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చిందని తెలిపారు.ఇక, ఆత్మహత్య చేసుకుని మరణించిన

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(8) మరోసారి విఫలమయ్యాడు. ఇక, వైభవ్ సూర్యవంశీ తనదైన స్టైల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25) వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, ఇషాన్ కిషన్(81, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ(60 నాటౌట్, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించారు. ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగారు. దీంతో జింబాబ్వేకు టీమిండియా 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, బ్రాడ్ ఎవాన్స్ బ్రయాన్ బెన్నెట్, న్యూమన్, నగరవ తలో వికెట్ పడగొట్టారు.జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారీ స్కోరు చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసిన టీమ్ఇండియా ఇషాన్ కిషన్ (81; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్ వర్మ (60*; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో మెరిశ










ఢిల్లీ: ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో తొలి అడుగు పడిందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు...దేశవ్యాపంగా విద్యార్థుల పోరాటం చూసి గర్విస్తున్నానని, అణచివేతకు గురైన ఏ వర్గమైనా ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు. వీధుల్లోకి వచ్చి పోరాడిన యువత, విద్యార్థులకు రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. మరో రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిపై విచారణ జరపాలని రాహుల్ గాంధీ అన్నారు.




ఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని సిజెపి నేతలు తెలిపారు. మిగతా 3 డిమాండ్లు కూడా నెరవేరేవరకు వేచి ఉందాం అని అన్నారు. ఈ సందర్భంగా సిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిజెపి నేతలు సూచించారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, దాడిచేసిన పోలీసు అధికారులు తమకు క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన చేసేవరకు ఈ ఉద్యమం ఆగదని, సాయంత్రం 6.గం.లకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తమకు రాజకీయాలు అవసరం లేదని సిజెపి నేతలు పేర్కొన్నారు.





