24495 వార్తలు



లార్డ్స్: మూడో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్పై ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో మూడో వన్డేలో విజయం సాధించింది. రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసినప్పటి చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ 388 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. రోహిత్ శర్మ 110 బంతుల్లో 138, శుభ్మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు, విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్మెన్లు ఒత్తిడికి గురికావడంతో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్లో శ్యామ్ కరన్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జాకోబ్ బెతెల్ తలో ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ వికెట్ తీసి 91 పరుగులు చేసిన జాకబ్ బెతెల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 249 పరుగులు చేసిన జోయ్ రూట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు.

డెహ్రాడూన్: చిరుత పులి ఇంట్లోకి తండ్రిపై దాడి చేస్తుండగా అతడిని కూతురు కాపాడిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావత్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిమల్టా గ్రామంలో సురేశ్ చంద్ర పాండే(64) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి కిరణ్ పాండే(35) అనే కూతురు ఉంది. సురేశ్ భోజనం చేసి టివి చూస్తుండగా అతడిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. వెంటనే కిరణ్ పాండే గట్టిగా కేకలు వేయడంతో పాటు తండ్రి ఇంట్లో నుంచి బయటకు లాగి డోర్ మూసింది. వెంటనే తండ్రిని స్థానిక ఆస్పత్రికి తరలించింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. చాకచక్యంతో చిరుతను ఇంట్లో బంధించిన కిరణ్ పాండేను పోలీసులు, గ్రామస్థులు, అటవీ సిబ్బంది ప్రశంసించారు.











నవతెలంగాణ – హైదరాబాద్ : అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు తెరపడింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమితో మెస్సీ జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు. చివరి మ్యాచ్లో ట్రోఫీతో ముగించాలని ఆశించినా అది నెరవేరకపోవడంతో భావోద్వేగానికి గురయ్యాడు. 2016లో రిటైర్మెంట్ ప్రకటించినా, అభిమానుల విజ్ఞప్తితో తిరిగి వచ్చి 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లు, 2022 ప్రపంచకప్ను అర్జెంటీనాకు అందించాడు. అనేక చారిత్రక విజయాలతో అంతర్జాతీయ ఫుట్బాల్లో […] The post ఫుట్బాల్ కు వీడ్కోలు పలికిన మెస్సీ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించినా విజయం దక్కలేదు. 388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో సొంతం […] The post రో.కో పోరాటం వృధా.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. స్పెయిన్ విజయం సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ లియాండ్రో పరేడెస్, స్పెయిన్ ఆటగాడు గావిపై దాడికి దిగాడు. అతడిని తోసేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించగా, అడ్డుకునేందుకు వచ్చిన మరో ఆటగాడిపై కూడా దాడి చేశాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రిఫరీ పరేడెస్కు రెడ్కార్డ్ […] The post ఫిఫా ఫైనల్లో ఘర్షణ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఫిల్మ్ ఫెడరేషన్ మధ్యవర్తిత్వంతో శుభం కార్డు పడింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై విధించిన శాశ్వత నిషేధాన్ని ఫెడరేషన్ అధికారికంగా ఎత్తివేసింది. సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చొరవ చూపడంతో ఈ సమస్య సామరస్యంగా పరిష్కారమైంది. ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీకి దర్శకులు, నిర్మాతల మండలి ప్రతినిధులతో పాటు […] The post జానీమాస్టర్పై నిషేధం ఎత్తివేసిన ఫెడరేషన్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు జిల్లాలు పూంచ్, రాజౌరీలలో ఆదివారం కురిసిన కుండపోత వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 12 మంది మరణించారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియరాలేదు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వందలాది ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమవగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అధికారుల వివరాల ప్రకారం, పూంచ్ జిల్లాలో 9 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో […] The post జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 12 మంది మృతి appeared first on Navatelangana.

మన తెలంగాణ/రాజేంద్రనగర్: అతను శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి. కానీ, సభ్యసమాజం సిగ్గుపడేలా నీచమైన వ్యక్తిత్వాన్ని ఒంట బట్టించుకున్నాడు. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణికి అక్రమ సంబంధం అంటగడుతూ, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడంతో పాటు ఆమెపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు. అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి వద్ద గల సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల్ల ట్రైనీ ఐపీఎస్ అధికారిణి జూన్ 23నుంచి పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఆమెతో పాటు అదే బ్యాచ్కు చెందిన పలువురు ఐపీఎస్లు శిక్షణ పొందుతున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి అనే తోటి ఐపీఎస్ ట్రైనీ బాధితురాలిని కొన్నిరోజులుగా వేధించడం మొదలుపెట్టాడు. తోటి వారిముందు సదరు మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ వచ్చాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమెకు మరొక శిక్షణ పొందుతున్న ఐపీఎస్తో లైంగిక సంబంధం ఉన్నదని తప్పుడు ఆరోపణలు చేశాడు. అక్రమ సంబంధం ఉందని అంగీకరించేలా ఆమెపై ఒత్తి

నీతి ఆయోగ్ ఇండెక్స్లో తెలంగాణ ఫ్రంట్ రన్నర్,,, ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్’లో 13వ ర్యాంకు.. 100కు 47.3 స్కోరుతో సత్తా..


మా భూములకు కాదు, మా బతుకులకే కంచె వేస్తున్నారు !రైతులు దీక్షా శిబిరాన్ని శనివారం అర్ధరాత్రి తొలగింపు రైతులను వేరే ప్రాంతాలకు తరలింపు భారీ బందోబస్తు బహదూర్గూడ దిగ్భందం పోలీసుల ఆధీనంలో బహదూర్గూడ బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసుల పహారా బహదూర్గూడ భూ వివాదంలో 36 మందిపై కేసులు నమోదు మన తెలంగాణ/హైదరాబాద్ : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణలో భాగంగా ప్రభుత్వం శంషాబాద్ బహదూర్ గూడ రైతులకు చెందిన 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. తొమ్మిది రోజులుగా నిర్వాసితులు తమకు పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వమని, గత 8 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. రైతులు దీక్షా శిబిరాన్ని భారీ పోలీసు బలగాలు తొలగించి, రైతులను అక్కడి నుంచి తరలించారు. భారీ బందోబస్తుతో బహదూర్గూడను దిగ్బంధించారు. పోలీసులు రాత్రికి రాత్రి రైతులను వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించారు. ప్రభుత్వఉద్యోగాల సమాచారం పోలీసు పహారాలో ప్రభుత్వం సేకరించిన రైతులకు చెందిన 650 ఎకరాల భూ మి చుట్టూ హైడ్రా, రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని ఇతరు