
5213 articles




నీట్ పరీక్ష రద్దుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై ఫైరయ్యారు. 22 లక్షల విద్యార్థుల కలలు చిన్నాభిన్నం అయ్యాయని.. కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని మండిపడ్డారు. పేపర్ లీక్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు చేశారు. దీనిపై స్పందించిన రాహుల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ నగలు అమ్మి పిల్లలను చదివించారని.. రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే ఈ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు.మరోవైపు, నీట్ రద్దుతో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఎన్టీఏ స్పందించింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై సిబిఐతో దర్యాప్తు చేయిస్తామని తెలిపింది. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత మరోసారి నీట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని.. తదుపరి పరీక్షకు అభ్యర్థులు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదని.. ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, ఈనెల 3న నీట్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే.





గులాబి అధినేత కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మా ణం, సభ్యత్వ నమోదు, జిల్లాలు, శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జ్ల నియామకం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలిపక్షాల ఉప నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది



న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. లారా వోల్వార్డ్ జట్టుకు నాయకత్వం వహించనుంది. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ జట్టులో చోటు దక్కించుకుంది. 37 ఏళ్ల షబ్నిమ్ 2023లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి.. తన నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంది. అలాగే, గత ఏడాది తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, జట్టులో చేరిన మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ కూడా అవకాశం ఇచ్చారు. వీరితోపాటు టాజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, క్లో ట్రయాన్, అయబోంగా ఖాకా వంటి పలువురు అనుభవజ్ఞులైన క్రీడాకారిణులకు జట్టులో చోటు దక్కింది.దక్షిణాఫ్రికా మహిళల టీ20 జట్టు:లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా (WK), మారిజాన్నే కప్ప్, అయాబొంగా ఖాకా, సునే లూస్, కరాబో మెసో (wk), నోన్కులులేకో మ్లాబా, కైలా చ్లోక్హుక్, కైలా చ్లోక్హుక్, నీకెర్క్.

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దుచేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైంది. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు […] The post నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత కేంద్రానిదే: కేటీఆర్ appeared first on Navatelangana.

– మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలి– జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలినవతెలంగాణ – జుక్కల్ మంగళవారం హైదరాబాద్లో మంత్రివర్యులు, మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల సేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగుతూ, ఉన్నత పదవుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించారు. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో […] The post మంత్రి అజారుద్దీన్ ను కలిసిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథను అరెస్టు చేయాలని.. DYFI,AIDWA,SFI ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మహబూబ్ నగర్, హనుమకొండ DYFI,AIDWA,SFI నిరసనలు చేపట్టాయి. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద బండి భగీరథ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్ పాత్రపై విచారణ చేపట్టి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని నుంచి కేంద్రమంత్రి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో బండి […] The post బండి భగీరథ్ దిష్టిబొమ్మ దగ్ధం appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : థాయ్లాండ్లో పర్యటనకు వెళ్లిన భారత పర్యాటకులకు తీవ్ర అస్వస్థత ఎదురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుకెట్లోని ఓ కేఫ్లో ఈ నెల 9న నలుగురు భారత టూరిస్టులు అపస్మారక స్థితికి చేరుకున్నారని, వారిలో ఒకరు మరణించారని థాయ్లాండ్లోని భారత ఎంబసీ ధృవీకరించింది. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. ఈ నెల 9వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఐదుగురు భారతీయ స్నేహితులు (కుశాగ్ర అగర్వాల్, […] The post థాయ్లాండ్లో భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.

చెన్నై: టివికె ఎమ్మెల్యే జెసిడి ప్రభాకర్ తమిళనాడు శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఎమ్మెల్యే రవిశంకర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభాకర్ నామినేషన్ను ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రతిపాదించారని, స్పీకర్ పదవికి కేవలం ఆయన నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో, ఆయన ఏకగ్రీవంగా, పోటీ లేకుండా ఎన్నికయ్యారని తాత్కాలిక స్పీకర్ ఎంవి కరుప్పయ్య ప్రకటించారు.స్పీకర్ ఎన్నికైన తర్వాత ప్రభాకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఏకైక సభ్యుడు, తురైయూర్ నియోజకవర్గానికి చెందిన టివికె ఎమ్మెల్యే రవిశంకర్ అని, ఆయన నామినేషన్ను సెంగుట్టయ్యన్ ప్రతిపాదించారని తెలియజేశారు. మరే ఇతర పోటీదారులు లేకపోవడంతో, రవిశంకర్ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని స్పీకర్ తెలిపారు.
నవతెలంగాణ – పరకాల ఎరువుల కంపెనీల స్వార్థపూరిత ‘లింకు’ విధానాలు, అనైతిక వ్యాపార తంత్రాల వల్ల గ్రామీణ రిటైల్ వ్యవస్థ పూర్తిగా దివాలా తీసిందని, దీనివల్ల అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్టేట్ అసోసియేషన్కు సమస్యలను నివేదిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేళ్లుగా ప్రముఖ కంపెనీలు రిటైల్ డీలర్ల మార్జిన్లను నామమాత్రం చేశాయని, రవాణా […] The post ఎరువుల కంపెనీల ‘లింకు’ దోపిడీపై పరకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అసోసియేషన్ ధ్వజం appeared first on Navatelangana.

హైదరాబాద్: కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఎన్డిఎ ప్రభుత్వానికి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం చేతకావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్డిఎ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందని, 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు విద్యార్థులకు శాపంగా మారాయని, వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం దారణమని కెటిఆర్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని ధ్వజమెత్తారు. పరీక్ష పేపర్ లీకేజ్ వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా కఠినంగా శిక్షించాలని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్రప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లక్కి మార్వత్ జిల్లాలోని సారాయ్ నౌరాంగ్ బజార్లో మంగళవారం కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసులు, పౌరులు సహా మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. The post పేలిన కారు బాంబు..8 మంది మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్లో పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా ఈనెల 3న నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీలోని శాస్త్రీ భవన్ ఎదుట NSUI విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను బారికేడ్లలతో అడ్డగించారు. అదే విధంగా నీట్ పరీక్ష రద్దుపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. […] The post నీట్ పరీక్ష రద్దు..ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు appeared first on Navatelangana.