25301 articles

నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచ్ ఆధ్వర్యంలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.గ్రామాలలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్ళు,శివసత్తుల శిగాలు,డీజే పాటలు,పోతురాజుల విన్యాసాలతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొన్నది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ లు,పాలకవర్గం సభ్యులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,తదితరులు పాల్గొన్నారు. The post మండలంలో ఘనంగా బోనాల పండుగ appeared first on Navatelangana.

నవతెలంగాణ-వైరావ్యవసాయ అనుబంధ పరిశ్రమగా 1996లో దీవెల వెంకటేశ్వరరావు, మురళీధర్ భూతడ ప్రారంభించిన ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ మూడు దశాబ్దాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొని నిలబడింది. ఆదివారం రైతులు, డీలర్లు, వినియోగదారుల ప్రత్యేక కలయికతో తమ అనుభవాలను యాజమాన్యం పంచుకుంది. 2007 – 2014 మధ్య కాలంలో రోజూ 2 లక్షల లీటర్ల పాల విక్రయం, లక్ష లీటర్ల సేకరణతో కంపెనీ స్వర్ణయుగాన్ని చూసింది. అయితే, 2019లో వ్యవస్థాపకులు దీవెల వెంకటేశ్వరరావు అనారోగ్యం, ఆర్థిక […] The post శ్రామికుల సమష్టి కృషితో ప్రగతి పథంలో ‘వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్’ appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు వివిధ కారణాల వలన వారి సెల్ ఫోను పోగొట్టుకోవడం జరిగిందని,ఆట్టి విషయమై వారు కొయ్యూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోగొట్టుకున్న అట్టి సెల్ ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి వాటిని సేకరించి బాధితులకు మొబైల్ ని ఆదివారం పోలీస్ స్టేషన్లో కొయ్యూరు ఎస్ఐ పి.మహేందర్ కుమార్ అందజేశారు. ఇందుకు బాధితులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. The post పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత appeared first on Navatelangana.

నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని నల్లగుట్ట తండాలో రేషన్ కార్డుల లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులను అందించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీనివాస్ జిపిఓ ఉప్పలయ్య తెలిపారు. ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ కార్డును పొంది రేషన్ నుంచి వచ్చే సంక్షేమం పథకాలను పొందాలని తెలిపారు. గత ప్రభుత్వం పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పేదల బాగోగుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి […] The post నల్లగుట్ట తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ appeared first on Navatelangana.

శంషాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహిస్తున్న కోడి పందేలపై టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ఆర్టివొ కార్యాలయం వెనుక ఓ పాత పౌల్ట్రీ ఫామ్లో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదిభట్ల పోలీసులతో కలిసి శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిందితుల నుంచి రూ.3.60 లక్షలు, 31 పందెం కోళ్లు, 146 కోడి కత్తులు, 20 సెల్ఫోన్లు, స్కోర్ నోట్బుక్ స్వాధీనం చేసుకున్నారు. 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి బెట్టింగ్దారులను పిలిపించి, కోడి పందేల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుడు, భూమి యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోడి పందేలు, జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న నవతెలంగాణ-నెల్లికుదురు గ్రామంలో పేదల అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు మద్ది రాజేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన పాలెపు ఉప్పలమ్మ సోమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ నూతన ఇళ్లను ప్రారంభించి వారికి నూతన వస్తువులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఆలయపు ఉప్పలమ్మ సోమయ్య మాట్లాడుతూ నాకు ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాంగ్రెస్ […] The post పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం appeared first on Navatelangana.

2001-2002వ బ్యాచ్ పూర్వ విద్యార్థులునవతెలంగాణ-నెల్లికుదురుమండల కేంద్రానికి సమీపంలోని రామకృష్ణ గురుకుల పాఠశాలలో 2001-2002 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక అమూల్య గార్డెన్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అలనాటి గురువులను సత్కరించడంతోపాటు వారి అమూల్య సందేశాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కూరపాటి క్రాంతి అధ్యక్షతన […] The post 25 వసంతాలకు కలిసిన వేళ.. అపూర్వ సమ్మేళనం appeared first on Navatelangana.

GMR Hyderabad International Airport has secured three major recognitions linked to Airports Council International (ACI) World in 2026, highlighting its performance in customer experience, accessibility and passenger arrivals. The airport achieved the prestigious ACI World Customer Experience Accreditation – Level 5, received Accessibility Enhancement Accreditation – Level 2, and was recognised among the world’s best airports for arrivals under the ACI ASQ Customer Experience Awards.


ఆకలితో అలమటిస్తున్న శిశువులు, గోపత్య కరవైన తల్లులు, గర్భిణీలునేపాల్ వరదలతో రద్దీగా మారిన ఆశ్రయ కేంద్రాలు క్లిష్టంగా మారుతున్న ప్రసూతి వైద్యం రుతుక్రమంలో ఉన్న బాలికలకు శానిటరీ ప్యాడ్ల కొరత ఖాట్మండూ: నేపాల్ను అతలాకుతులం చేసిన మెరుపు వరదలు వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. నివాసాలు కోల్పోయి, తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపాల్ తల్లుల కష్టాలు ఇంతింత కాదన్నట్టు అత్యంత దయనీయంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే పసిబిడ్డలకు ఇస్తుండటం, తల్లిపాలు లేక ఆకలితో అలమటిస్తున్న శిశువుల రోదనలు, గర్భిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ గోప్యతకు నోచుకోని అనేక మంది పరిస్థితి కలిచివేస్తోందని కథనాలు వెలువడుతున్నాయి.నేపాల్ వరదల్లో శర్మిలా శ్రేష్ట నివాసం కొట్టుకుపోయింది. కొన్ని రోజుల తర్వాత తన చిన్నారిని తిరిగి కలుసుకుంది. రద్దీగా ఉన్న ఓ ఆశ్రయంలో ప్రస్తుతం చిన్నారితో ఉంటోంది. అయితే అక్కడ పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే పసిబిడ్డ తినడం చూస్తూ నిస్సహాయంగా కంటతడి పెడుతోంది. చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. 14 నెలలున్న ఆమె కుమార్తె వాయవ్య ఖాట్మండూలోని ఓ పాఠశాల


నవతెలంగాణ – మిడ్జిల్ ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మసిగుండ్లపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్ల శ్రీనివాసులు చారి (44) మసిగుండ్లపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో ఫాంపౌండ్ గుంతలో స్నానం చేసేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందినట్టు చెప్పారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల క్రితమే మృతుడి తమ్ముడు […] The post ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి appeared first on Navatelangana.

నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘#NBK111’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. ‘వీరసింహారెడ్డిై’ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. కాగా, ఆదివారం ఈ సినిమా టైటిల్ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘దాదా’ అనే టైటిల్ని ఖరారు చేశారు. టైటిల్ గురించి తెలియగానే గూస్బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ విఝయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది. ఇటీవల ఇదే మూవీ షూటింగ్లో బాలకృష్ణ గాయపడ్డారు. గాయం కారణంగా ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో బాల

నవతెలంగాణ-హైదరాబాద్ : నందమూరి అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రం అధికారికంగా ఖరారైంది. అతడి తొలి చిత్రానికి ‘బింబిసార’ వంటి బ్లాక్బస్టర్ను అందించిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించనుంది. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ భారీ ప్రాజెక్ట్ను అధికారికంగా […] The post నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారు.. appeared first on Navatelangana.

సింగపూర్ మాజీ ప్రధాని, సీనియర్ మంత్రి లీ సియెన్ లూంగ్ ఖండననేపాల్ వరదల తర్వాత సోషల్ మీడియాలో పలువురు నెటిజన్ల విద్వేష వ్యాఖ్యలు 14 వివాదాస్పద పోస్టుల తొలగింపునకు ఆదేశాలు సింగపూర్ సిటీ : నేపాల్ వరద దుర్ఘటన తదనంతర పరిణామాల్లో సింగపూర్లోని భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగుతున్న వర్ణవివక్ష, విద్వేషపూరిత ప్రచారాన్ని ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సియెన్ లూంగ్ తీవ్రంగా ఖండించారు. మానవతా దృక్పథంతో స్పందించాల్సిన విపత్తు సమయంలో ఇలాంటి జాతి విద్వేష వ్యాఖ్యలు వెలువడటం అత్యంత ఆందోళనకరమని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు. క్లిష్ట సమయాల్లో ప్రజలంతా విభేదాలను పక్కనపెట్టి, విద్వేషాలను తిరస్కరిస్తూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. నేపాల్లో గల్లంతైన తొమ్మిది మంది సింగపూర్ పౌరుల జాతీయతను ప్రశ్నిస్తూ, అలాగే సింగపూర్ ఎయిర్లైన్స్-ఎయిర్ ఇండియా పెట్టుబడుల వ్యవహారాన్ని ముడిపెడుతూ సోషల్ మీడియాలో భారత సంతతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున విష ప్రచారం జరిగింది. ‘సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారు‘ అని చిత్రీకరిస్తూ, అనుచిత పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై సింగపూర్ యంత్రాంగం కఠినంగా

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు ఆరుగురిని సహాయక బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉన్నతస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు […] The post ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..ఒకరి మృతి appeared first on Navatelangana.

సాగర్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి సుమారు 10 మంది మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం, బండా తసహసిల్లోని ఓ మద్యం దుకాణంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు శనివారం రాత్రి మద్యం తాగారు. ఇంటికి వచ్చిన వెంటనే అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పది మంది చికిత్స పొందుతూ మృతిచెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ మద్యం పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ నుంచి సరఫరా అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తొలి మరణం ఆదివారం తెల్లవారుజామున నమోదైంది.సమాచారం తెలిసిన వెంటనే సాగర్ డివిజనల్ కమిషనర్, ఐజీ, కలెక్టర్, ఎస్సీ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్య ఏర్పాట్లను పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లోని ఏడు మద్యం దుకాణాలను జిల్లా యంత్రాంగం సీజ్ చేసింది. మద్యం నమూనాలను వెంటనే సేకరించి పరీక్షలకు పంపాలని ఆదేశించింద


సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్.. ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కెసిఆర్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుడా హాజరుకావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలన్నారు. ఈ సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శాసనసభ, మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజల అజెండానే బిఆర్ఎస్ అజెండాగా ఉంటాలి. కాంగ్రెస్, బిజెపి విధానాలను ఎండగట్టాలి. స్పీకర్ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలపై నిలదీయాలి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ప్లాప్. తమ ప్రభుత్వం మళ్లీ రాదని కాంగ్రెస్ నేతలకు అర్థమైంది. అందుకే అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. నా చావు కోరుతూ పదే పదే మాట్లాడుతున్నారు. పాలన చేతకాకే రేవంత్ రెడ్డి బూతు పురాణం. అలాంటి వ్యక్తితో చర్చకు అసెంబ్లీకి రావాలా?’’ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.


తెలుగు నటుడు సుహాస్, తమిళ నటుడు సూరి కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘మండాడి’. మతిమారన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు. ‘పందెం అనేది ఎవరు పెద్ద మొనగాడో చూపించుకోవడానికి జరిపే పోటీ కాదు.. పందెం అంటే తెలివి’ వంటి డైలాగ్ను సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా సముద్రం మీద సాగే బోట్ రేసింగ్లు యాక్షన్ సీన్స్ అలరిస్తున్నాయి. మహిమ నంబియార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


Virat Kohli Announces Retirement from Test Cricket
RRR 2: SS Rajamouli Officially Announces Sequel